జింబాబ్వే పర్యటనలో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసిన తరుణంలో శ్రీలంక పర్యటనలో జరగనున్న టెస్టు సీరీస్ కు బిసిసిఐ ఈ నెల 23న జట్టు సభ్యలను ప్రకటించనుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం కానుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా పూర్తి స్థాయిలో జట్టును ఈ సిరీస్ లో బరిలోకి దిగే అవకాశం వుంది. శ్రీలంతో సీరీస్ లో భాగంగా భారత జట్టు మూడు టెస్టులను అడనుంది. ఆగస్టు 12న తొలి టెస్టు గాలేలో ప్రారంభం కానుండగా, రెండవ టెస్టు 20 నుంచి 24 వరకు , మూడవ టెస్టు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొలంబోలోని ఎస్ ఎస్ సి లో జరగనున్నాయి.
ఇందుకోసం ఈ నెల మూడున భారత జట్టు శ్రీలంక కు చేరుకుని వార్మ్ అప్ మ్యాచ్ లను ప్రాక్టీసు చేయనుంది. సెప్టెంబర్ 2న భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకోనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖార్ ధావన్, రోహిత్ వర్మ, అజింక్యా రహానేలతో పాటు మరెవరికి స్థానం లభించనుందో..? చాలా కాలం తరువాత టీమిండియాలో చేరిన హర్భజన్ సింగ్ తన స్థానాన్ని పధిలపర్చుకుంటాడా..? లేదా అన్నది కూడా తేలాల్సి వుంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లు లేకుండానే బరిలో దిగిన భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేయడంతో దోహదపడిన తెలుగుతేజం అంబటి రాయుడు, బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ ప్రతిభ కనబర్చని స్టవర్ట్ బిన్ని, కేదార్ జాదవ్, మనీష్ పాండేలకు కూడా ఈ తుది జాబితాలో స్థానం లభిస్తుందా..? లేదా అన్న అంశాన్ని వేచి చూడాల్సిందే.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more