అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ప్రతిష్టాత్మక క్రికెట్ ప్రపంచ కప్ టార్నమెంటులో కేవలం అత్యుత్తమ జట్లకు మాత్రమే స్థానం కల్పించాలన్ని ప్రతిపాదనను మరిల్ బోన్ క్రికెట్ క్లబ్ తోసిపుచ్చింది. ఈ రకంగా కేవలం పది జట్లను మాత్రమే ప్రోత్సహించిన పక్షంలో క్రికెట్ ఆట మరోమారు పూర్వ దశకు చేరుకుంటుందని ఎంసీసీ క్రికెట్ కమిటీ అభిప్రాయపడింది. ఇది క్రికెట్ క్రీడ ఉనికికే హానికరమని పేర్కోంది. ఒలంపిక్స్ లో స్థానం కోసం ఐసిసి ఆసక్తిని కనబర్చాలని పేర్కోంది. గత రెండు రోజులుగా భేటీ అయిన ఎంసిసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఎంసీసీ క్రికెట్ కమిటీ నూతన సభ్యులుగా ఎంపికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి, అస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ రమీజ్ రజాలు.. ఇప్పటి వరకు సదరు పదవులలో సభ్యులుగా కోనసాగిని స్టీవ్ బక్ నర్, రాహుల్ ద్రావిడ్ లకు వీడ్కొలు తెలిపే సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా నూతన క్రికెట్ కమిటీ సభ్యలు ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో 12 జట్లతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 2019, 2023 ప్రపంచ కప్ టోర్నమెంటులలో పది జట్టతోనే అడాలన్న నిర్ణయం హానికరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇక ఒలంపిక్స్ లో స్థానం కోసం ఐసిసి పాటుపడితే.. క్రికెట్ క్రీడ విశ్వవ్యాప్తం కావడానికి, ప్రపంచ నలుమూల నుంచి అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభించడానికి ఇది దోహపడుతుందన్నారు. ఐసీసీలోని అన్ని సభ్య దేశాల బోర్డులు కూడ అందుకు మద్దతు తెలపాలని సూచించింది. ప్రస్తుతం క్రికెట్ లో అతి పోట్టి ఫార్మెట్ గా వున్న ట్వంటీ 20 పార్మెట్ ను ఒలంపిక్స్ లో ఆడేందుకు వీలుగా వుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు సమావేశానంతరం ఎంసీసీ క్రికెట్ నూతన కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more