బంగ్లాదేశ్ మీడియా దురంహాకారినికి ఇది పరాకాష్ట. అత్యంత చిన్న సిరీస్ లో టీమిండియాపై పైచేసి సాధించిన బంగ్లాదేశ్ గోప్పతనాన్ని భారత్ మీడియా వేనోళ్ల శ్లాఘిస్తున్న క్రమంలో.. బంగ్లాదేశ్ మీడియా మాత్రం తద్విరుద్దంగా వ్యవహరిం,చింది. టీమిండియా ఆటగాళ్లను, దోని సేనను అవమానపర్చేవిధంగా అతి హేయకరమైన ప్రకటనలను ప్రచురించింది. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలుపోందడంతెనే అక్కడి ఆటగాళ్లను భుజానికి ఎత్తుకుని ప్రకటనలు గుప్పిస్తే.. పర్వాలేదు కానీ, ఓటమి పాలైన వారిని టార్గెట్ చేసి వారిని కించపర్చే విధంగా ప్రకటనలు ఇవ్వడంతో అదికాస్తా వివాదాస్పద అంశంగా మారింది.
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో అంఫైర్ల తప్పిదాల కారణంగానే టీమిండియా బంగ్లాదేశ్ పై గెలించిందని విరుచుకుపడ్డ ఆక్కడి మీడయా తాజాగా టీమిండియాను కించపర్చింది. దొసి సేనలోని ముఖ్యలు అజింక్యా రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, రవిందంద్రన్ అశ్విన్ సహా కెప్టెన్ ధోనీలకు అరగుండు గీసనట్లుగా మార్పింగ్ చేసిన బంగ్లా మీడియా.. వారి చేతిలో ఒక బ్యానర్ ను పెట్టి.. దీనికి మేం అలవాటు పడ్డాం.. ఇది మాకు అలవాటు అన్న విధంగా వారి బాషలో రాసి పెట్టారు.
దీనికి పైన బంగ్లాదేశ్ యువ బౌలర్ ముస్తాపిజుర్ రహామాన్ చేతిలో కట్టర్ పెట్టి.. చురుకైన కట్టర్లు బంగ్లా వద్ద వున్నాయని, ఇందులో అన్ని ఆప్ కట్టర్లే నని, ఇవి కావాలంటే ఢాకాలోని మిర్పూర్ స్టేడియం మార్కెట్ కు రావాలని ఆ దేశ ప్రధాన వార్తా పత్రిక ప్రోథోమ్ లో పెద్ద సైజు ఫైక్ కట్టర్ను పెట్టి ముద్రించింది. దీనిపై రెండు దేశాల మధ్య సామాజిక మాద్యమం ద్వారా ఒక రకమైన యుద్దమే జరుగుతోంది. అయితే ప్రచూర్యం గల మీడియా ఇలాంటి చౌకబారు ప్రకటనలు ఇచ్చే ముందు.. ఒకసారి నైతిక విలువల గురించి కూడా ఆలోచించాలి. మేకపోతు గాంభీర్యంతో ఒకసారి విజయం బంగ్లాను వరించడంలో తప్పు లేదు. అయితే అదే రిపీట్ అవ్వుద్ది అన్న అహంకార దోరణి, కండకావరం ఆటలలో పనికి రావు. ఇవి క్రీడాస్ఫూర్తికి పూర్తి వ్యతిరేకమన్న విషయాన్ని మీడియా తెలుసుకోవాలి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more