వాళ్లంతా క్రికెట్ రారాజులు.. వాళ్ల అనుభవాలు ప్రస్తుత క్రికెటర్లకు పాఠాలు. ఫ్యూచర్ లో టీమిండియాను ఓ సరికొత్త జట్టుగా నిలపాలంటే ఇటువంటి గ్రేట్ క్రికెటర్ల అనుభవాలు, సలహాలు ఎంతో అవసరం. అందుకే సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో చోటు కల్పస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తమ అత్యుత్తమ ఆటతో సుదీర్ఘ కాలం టీమ్ ఇండియాను ముందుకు నడిపించిన దిగ్గజాలను ఒకటిగా చేర్చి నవతరానికి మార్గనిర్ధేకత్వం చేయాల్సిందిగా వారిని కోరింది భారత క్రికెట్ భవిష్యత్తును వీరి చేత్తులో పెడుతూ ఈ ముగ్గరికీ బిసిసిఐ అడ్వజరీ కమిటీలో స్థానం కల్పించింది.
సోమవారం ఈ ముగ్గురితో వేర్వేరుగా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మాట్లడిన అనంతరం బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు ప్రకటన చేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్ జగన్మోహన్ దాల్మియా క్రికెట్ లెజండ్స్ ను అడ్వజరీ కమిటీ మెంబర్స్ గా నియమించారని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకుర్ చెప్పారు. ఈ ముగ్గరి నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి టీమ్ ఇ:డియాకు ప్రధాన కచ్, టీమ్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. మున్ముందు భారత క్రికెట్ కు సంబంధించి అనేక వ్యవహరాల్లో వీరి పాత్ర కీలకం కానుందన్నారు.
భారత జట్టు బంగ్లాదేశ్ టూర్కు బయలుదేరక ముందే ముగ్గరు దిగ్గజాలతో కూడిన బిసిసిఐ సలహా మండలి సమామేశమవుతుందని సమాచారం. ఈనెల 4 లేదా 5వ తేదీన బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా హాజరయ్యే ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ పాల్గొంటారని తెలుస్తున్నది. బంగ్లాదేశ్ టూర్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చిస్తారు. పసికూన బంగ్లాదేశ్ బాగా రాటు తేలి ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ ను, పాకిస్థాన్ సీరీస్ లో పాక్ ను కూడా మూడు చెరువుల నీళ్ల తాగించే స్థాయికి వెళ్లిన నేపథ్యంలో భారత్ను అన్ని విధాలా సిద్ధం చేయడానికి సచిన్ బృందం కృషి చేయనుంది. అందుకు అవసరమైన సూచనలు చేస్తుంది. అయితే బిసిసిఐ కోచ్ సహా డైరెక్టర్ పదవులకు సచిన్, గంగూలీలిద్దరూ పోటీ పడుతున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కూడా పలువురు క్రీడాభిమానులు చెవులు కోరుక్కుంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more