ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ పీఠం మరోమారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లాను వరించనుంది. ఈ పదవిని ఆశిస్తున్నవారిలో రాజీవ్ శుక్లా ముందువరుసలో కొనసాగుతున్నారు. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం పోటీ పడిన ముగ్గురు ఎవరూ.. స్పష్టమైన అధిక్యత కనబర్చకపోవడంతో.. రాజీవ్ శుక్లాను ఈ పదవికి ఎంపిక చేసేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. రాజీవ్ శుక్లా తదుపరి ఐపీఎల్ చైర్మన్ అని బీసీసీఐ కార్యవర్గ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం ఈ పదవిలో కోనసాగుతున్న రంజీబ్ బిస్వాల్ ను పక్కకు జరిపి రాజీవ్ శుక్తా ఈ స్థానాన్ని అక్రమించనున్నారు.
గత నెలలో ఐపీఎల్ కోశాధికారి పదవికి పోటీ చేసిన రాజీవ్ శుక్లా శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో ఓడిపోయారు. దాంతో ఇప్పుడు ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఈ పదవికి బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా మద్దతు కలిగిన టీమిండియా మాజీ కెప్టన్ సౌరవ్ గంగూలీ, మాజీ బిసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ మద్దతు కలిగిన రంజీబ్ బిస్వాల్, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మద్దత్తుతో అజయ్ షిర్కే ఈ పదవికి పోటీ పడ్డారు. అయితే ఈ ముగ్గురు.. తమ అధిక్యతను స్పష్టంగా చూపిడంలో విఫలమయ్యారు. దీంతో అవకాశం రాజీవ్ శుక్లాను వరించనునందని తెలిసింది. 2013లో టోర్నమెంట్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో రాజీవ్ శుక్లా ఐపీఎల్ చైర్మన్ గా కొనసాగారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more