న్యూజీలాండ్ లోని అక్లాండ్ స్టేడియంలో టీమిండియా ఆటను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు తొలి పాతిక ఓవర్లలో నిరుత్సాహం. స్టేడియం నుంచి భయటకు వచ్చేయాలనించేలా నిసృహ. ఆ నిరాశానిసృహాలను చీల్చుకుంటే వచ్చిన నూతనోత్తేజం.. ఆ జోడి ఆట తీరు చూసి ప్రేక్షకుల కరతాళాధ్వనులు.. చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్ లతో వన్డే కు బదులు టీ 20 మ్చాచ్ ను తలపించేలా సాగిని లక్ష్య చేధన దృశాలను వారు ఎన్నటికీ మర్చిపోలేదు. అప్పటి వరకు భారత్ పై అదిపత్యాన్ని కనబర్చిన జింబాబ్వే ఆటగాళ్లలో ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. అప్పటి వరకు తమకు మద్దతుగా స్టేడియం గ్యాలరీల్లోంచి వినిపించిన ధ్వనులు.. ఆ జోడి కోడుతున్న భారీ షాట్లలో కలసిపోయాయి.
ఢిపెండింగ్ ఛాంపియన్లుగా ప్రపంచకప్ బరిలో దిగిన టీమిండియా.. లీగ్ దశలో ఆరు వరుస విజయాలను నమోదు చేసుకుని సిక్సర్ కొట్టింది. జింబాబ్వేతో జరుగిన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఆరు విక్కట్ల తేడాతో గెలుపోందింది. కెప్టెన్ దోణి, సురేష్ రైనాలు దూకుడుగా ఆడి టీమిండియాకు విజయానందించారు. ఈ వరల్డ్ కప్ లో సురేష్ రైనా అద్భుత తొలి సెంచరీతో రాణించి నాలుగు సిక్స్ లు, తోమ్మిది ఫోర్ల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలువగా, కెప్టెన్ దోణి కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రెండు సిక్స్ లు ఎనమిది ఫోర్లతో 85 పరుగులు సాధించి టీమిండియాకు ఘన విజయాన్నిందాడు.
బింబాబ్వే తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ప్రారంభంలోనే టాప్ ఆర్డర్ తడబడి.. నాలుగు విక్కెట్లను కోల్పోయింది. తినాషి పన్యంగర వేసిన ఆరవ ఓవర్ లో ఓపెనర్ల విక్కెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాగా, అదే ఓవర్ లో ఐదవ బందతికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (4) విక్కెట్ కోల్పయి కష్టాల్లో పడింది. ఆ తరువాత 16 ఓవర్లో అజ్యింక రహనే (19) విక్కెట్ ను కొల్పోగా, 22 వ ఓవర్ లో విరాట్ కోహ్లీ (33) ఔలయ్యాడు. రజా వేసిన సాధారణమైన బంతిని స్లీప్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరుణంలో సురేష్ రైనా-మహేంద్ర సింగ్ ధోనీలు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేశారు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ.. టీమిండియాకు విజయాన్ని అందించారు.
అంతకుముందు బ్యాటింగ్ దిగిన జింబాబ్వే 48.3 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వేకు ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద జింబాబ్వే ఓపెనర్ మసకద్జ.. భారత పేసర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ చిబాబా.. షమీ బౌలింగ్లో ధావన్కు దొరికిపోయాడు. కాసేపటికి మోహిత్ శర్మ ఓవర్లో మిరె పెవీలియన్ బాటపట్టాడు. దీంతో జింబాబ్వే కష్టాల్లోపడింది. 20 ఓవర్ల వరకు ఆచితూచి ఆడింది. కెప్టెన్ బ్రెడిన్ టేలర్, ఆయనకు తోడు విలియమ్స్ క్రమేణా దూకుడు పెంచారు. టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. టేలర్.. విలియమ్స్తో కలసి నాలుగో వికెట్కు 93 పరుగులు, ఎర్విన్తో ఐదో వికెట్కు 109 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, షమీ, మోహిత్ శర్మలకు మూడేసి విక్కట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్ లభించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more