టీమిండియా ఫాస్ట్ బ్యాట్స్’మేన్ విరేందర్ సెహ్వాగ్.. ఈసారి జరగబోయే 2015 ప్రపంచ వరల్డ్’కప్’కు ఎన్నిక కాలేదని అందరికీ తెలిసిందే! మొదట్లో తాను 30 మంది సెలక్టర్లలో సెలెక్ట్ అవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారని కానీ.. చివరికీ అవి అడియాశలు అయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఈ ఆటగాడు.. కొన్నాళ్లపాటు ఆ దు:ఖంతోనే మీడియా ముందుకు రాలేదు. అయితే.. తాజాగా ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుని.. ఇండియా జట్టుకు గ్రీటింగ్స్ అందజేస్తున్నాడు.
వచ్చే నెలలో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్లో టీమిండియా తమ టైటిల్ నిలబెట్టుకోవాలంటూ సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. తప్పకుండా ఇండియా గెలుస్తుందన్న నమ్మకాయన్ని వ్యక్తం చేశాడు. స్థానికంగా జరిగిన ప్రపంచకప్ ట్రోఫీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘డిఫెండింగ్ చాంపియన్గా మన జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ టోర్నీలోనూ బాగా ఆడి టైటిల్ నిలబెట్టుకుని.. భారతీయులకు అమితానందం కలిగించాలి’ అని విషెస్ తెలిపాడు.
మరోవైపు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్.. ప్రపంచకప్’లో ఆడనున్న ఇండియా జట్టు బౌలింగ్ విభాగంపై ఆందోళన వ్యక్తం చేశాడు. చండీగఢ్లో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించిన ఆయన ఆ వేదికపైనే జట్టు గురించి మాట్లాడుతూ.. ‘15 మందితో కూడిన ప్రపంచకప్ ఇండియా జట్టు బాగానే ఉంది. కానీ.. బౌలింగ్ విభాగం ఏమేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా వుంది. ముక్కోణపు సిరీస్ కూడా ముగిశాక ఏమేరకు ప్రత్యర్థులకు సవాల్ విసరగలరో తెలిసిపోతుంది’ అని సూచించారు. అయితే.. జట్టు ఎంపికలో సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలక్టర్లు కఠినంగా వ్యవహరించారని అన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more