సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ అభిమానుల పాలిట ధైవంగా మారిన ఇటీవల భారత బ్యాటింగ్ దిగ్గజం త్వరలోనే వెండి తెరపై మెరవనున్నారు. భారత రత్న అవార్డును సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా కీర్తి గడించిన సచిన్.. పరుగుల పందేరాన్ని విడచి రాజకీయ నేతగా పార్లమెంటులోకి రాజ్యసభ సభ్యుడి హోదాలో అడుగుపెట్టారు. అయితే త్వరలోనే ఆయన హీరో అవతారం ఎత్తనున్నారు. ఇన్నాళ్లు తాను బ్యాటింగ్ దిగిన సందర్భంలో స్టేడియం గ్యాలరీల నుంచి ఫోర్, సిక్స్ అంటూ అభిమానుల అరుపులు ప్రతిధ్వనించేవి.. కానీ ఇకపై లైట్స్, కెమెరా, యాక్షన్ అనే దర్శకుల పదాలు వినబడున్నాయి. నిజమేనా అని సందేహిస్తున్నారా..?
నిజమే.. సచిన్ టెండుల్కర్.. తన క్రికెట్ అనుభావాలను స్వయంగా పదాలుగా మార్చి.. వాటిని పుస్తకంగా కూర్చి రచించిన స్వియానుభాల పుస్తకం ప్లేయింగ్ ఇట్ మై వే అనే పుస్తకాన్నే చిత్రంగా మలచనున్నారు. ఇందులో తన పాత్రను తానే నటించేందుకు కూడా సచిన్ అంగీకరించారు. తన పాతికేళ్ల క్రికెట్ జీవన ప్రయాణంపై ముంబై చిత్ర నిర్మాణ సంస్థ 200 నాటౌట్ సంస్థ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకోసం 200 నాటౌట్ సంస్థ సచిన టెంటుల్కర్ బ్రాండ్ సహా వాణిజ్య వ్యవహారాలను చూసుకుంటున్న రల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ తో ఒప్పందాలను కూడా చేసుకుందని సమాచారం. సినిమాలలో అవసరమైన పలు క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించిన వీడియో ఫూటేజీని కూడా ఇప్పటికే ఈ సంస్థ పలు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి సమకూర్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాని్న లండన్ రచయిత జేమ్స్ ఎర్క్ కైన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
సచిన్ టెండుల్కర్ బాల్యం, క్రికెట్ పై తనకు గల ఆసక్తి, తాను క్రికెట్ లోకి ప్రవేశించిన విధానం. అంచెలంచెలుగా ఎదిగిన వైనం తదితరాలతో పాటు సచిన్ రాసిన స్వియ చరిత్రను కూడా పరిగణలోకి తీసుకుని దర్శకుడు ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో సచిన్ వివాహానికి సంబంధించిన పలు సన్నివేశాలను కూడా పోందుపర్చనున్నట్లు సమాచారం. త్వరలోనే సెట్లపైకి రానున్న ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా 2000 సినిమా ధియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర నిర్మణ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more