భారతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ హఠాత్తుగా టెస్ట్ మ్యాచుల నుంచి రిటైర్’మెంట్ ప్రకటించడంతో అందరికీ షాక్ తగిలినట్లయ్యింది. దాదాపు 60 టెస్టులకు కెప్టెన్’గా వ్యవహరించిన ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మ్యాచులు ఓడిపోయిన కెప్టెన్’గా చెత్త రికార్డును సాధించాడు. పైగా.. ఇంగ్లాండులో జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఘోరపరాజయాన్ని ఎదుర్కోవడంతో అప్పటినుంచి ధోనీ కెప్టెన్సీ మీద ఎక్కువ విమర్శలు రావడం జరిగింది.
టీమిండియా అభిమానులతోబాటు మాజీ సీనియర్ ఆటగాళ్లు సైతం ధోనీని కెప్టెన్’గా తొలగించాలంటూ వాదనలు వినిపించారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లోనూ మరింత దారుణంగా ఓడిపోవడంతో ఈసారి విమర్శలు మరింతగా పెరిగాయి. దాంతో ధోనీ ఇలా టెస్ట్ మ్యాచుల నుంచి తప్పుకున్నట్లు సమాచారం! అయితే తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడం వెనుక అసలు కారణం వేరే వుందని ప్రచారం కొనసాగుతోంది.
గతకొన్నేళ్లుగా విదేశీ గడ్డపై టీమిండియా వరుసగా విఫలమవుతుండటంతో ధోనీని టెస్టు కెప్టెన్సీగా తొలగించి.. కోహ్లీని ఎంపిక చేయాలంటూ సలహాలివ్వడం ప్రారంభించారు. ధోనీ సారథ్యం వీడితే.. కోహ్లీకి ఆ బాధ్యతలు అప్పగించాలని గవాస్కర్, గంగూలీ, ఇంకా ఇతరులు సూచించారు. దీంతో తనకంటే జూనియర్ అయిన కోహ్లీ సారథ్యంలో ఆడాల్సి వస్తుంది. అలా ఆడితే తన గౌరవ మర్యాదలు పూర్తిగా దెబ్బతింటాయనే భావనతోనే ధోనీ ఇలా టెస్టు క్రికెట్’కు స్వస్తి చెప్పాల్సి వచ్చిందని వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ధోనీ ఇంత హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ఎవరూ ఊహించలేకపోయామని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ముఖ్యంగా గంగూలీ అయితే ఈ వ్యవహారంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సిరీస్ జరుగుతుండగానే ధోనీ తీసుకున్న నిర్ణయం షాక్’కు గురిచేసిందని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవడం మంచి నిర్ణయమేగానీ.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం సరికాదని తెలిపాడు. ఏదైతేనేం.. ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్ వ్యవహారం మాత్రం ఇంకా తీవ్ర దుమారాన్ని రేపుతూనే వుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more