భారత్ - ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 8 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఇవాళ్టి ఆటలో కోహ్లీ, రహానే జట్టు స్కోరును రేసుగుర్రంలా పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి కంగారూలను ఖంగారు పెట్టారు. కొహ్లి తొలి శతకంన్నర పరుగులు చేయగా.., రహానే కూడా స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. నిలకడగా క్రీజులో ఉంటూ.., మంచి స్కోరును అందించారు. జట్టు స్కోరు 409 పరుగులుగా ఉన్నపుడు లియాన్ వేసిన బంతికి రహానే ఔట్ అయ్యాుడు. 171 బంతుల్లో 147 పరుగులు చేయగలిగాడు.
రహానే స్థానంలో వచ్చిన ధోని కోహ్లితో సరిగా సమన్వయం కొనసాగించలేదు. ఈ కారణంచే ధోని వచ్చిన తర్వాత కొహ్లి పరుగులు కాస్త తగ్గాయి. ఇదే సమయంలో జాన్సన్ వేసిన బంతికి కొహ్లి కొట్టిన షాట్ హడిన్ చేతికి దొరికింది. దీంతో 169 పరుగుల వద్ద కొహ్లీ ఔట్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవాళ్టి ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తొలి సెషన్ ముగిసే సమయానికి స్కోరు బోర్డులను పరిశీలిస్తే భారత్ ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పాలి. ఇదే సమయంలో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఆస్ట్రేలియా 530 పరుగులు చేసి బ్యాటింగ్ ను భారత్ కు అప్పగించింది. తొలి రెండు టెస్టుల గుణపాఠాలు నేర్చుకున్న టీమిండియా ఆటగాళ్లు.., తొలిరోజునే భారీ స్కోరు చేశారు. అయితే వికెట్లు టపాటపా పడిపోవటం బాధాకరం. ఇప్పుడిదే అంశం ఆందోళన కల్గిస్తోంది. ఎనమిది వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా మిగిలిన వారితో టార్గెట్ కంప్లీట్ చేస్తుందా.. లేక ఆసీస్ బౌలింగ్ కు బౌల్డ్ అవుతుందా అనేది అర్ధం కావటం లేదు. స్పిన్నింగ్ కు అనుకూలించే పిచ్ పై.., కంగారూల బౌలింగ్ ధాటిని తట్టుకుని మరీ., భారత ఆటగాళ్ళు సత్తా చాటారు. ఇది అభినందించాల్సిన విషయం.., కానీ సోమవారం ఏం మాయ చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లను చేజార్చుకున్న భారత్ కు ఈ టెస్ట్ కూడా పోయిందంటే పరాయి గడ్డపై అవమానమే మిగులుతుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more