ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఒక అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. టీమిండియా జట్టుతో క్రికెట్ ఆడేందుకు భారత్ లో అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు... మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో వున్న కారణంగా అసలు మ్యాచులే ఆడకూడదని ఆ జట్టు ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. కొచ్చిలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ నుంచి ఇలా తిరుగుబాటును ప్రారంభించిన ఆ ఆటగాళ్లు.. ఎలాగోలా నాలుగు వన్డే మ్యాచులను ముగించారు కానీ.. ఐదో వన్డే ఆడేదిలేదంటూ తేల్చిపారేశారు. ఇంకా ఒక వన్డే, టీ20, మూడు టెస్టులు మ్యాచులు ఆడాల్సిన విండీస్ జట్టు... ఇలా అర్థంతరంగా భారత్ పర్యటన నుంచి నిష్ర్కమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కారణం :
ఈ ఏడాది సెప్టెంబర్ 19న విండీస్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఈ విషయమై తమతో చర్చించకుండా ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జరిగిందని... ఒకవేళ ఇది అమల్లోకి వస్తే తాము భారీగా నష్టపోతామంటూ జట్టు ఆటగాళ్లు కొచ్చిలో తొలి వన్డేకు ముందే నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముందుగానే పరిష్కరించాలని ఆటగాళ్లు డిమాండ్ చేసినప్పటికీ... మ్యాచ్ బరిలోకి దిగినా ఇంకా పూర్తికాకపోవడంతో ఆటగాళ్లందరూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో వాళ్లందరూ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హైండ్స్ రాజీనామా చేయాలంటూ బ్రేవో బృందం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కూడా బోర్డుకు బ్రేవో లేఖ రాశాడు. అయితే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీమానా చేసేది లేదని హైండ్స్ స్పష్టం చేశాడు. అలాగే బోర్డు అధికారులు కూడా ఈ విషయం మీద ఆటగాళ్లతో చర్చించకుండా నేరుగా ప్లేయర్స్ అసోసియేషన్తోనే తాము చర్చిస్తామని గురువారం చెప్పింది.
దీంతో ఆగ్రహించిన ఆటగాళ్లు భారత్తో సిరీస్ను తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగో వన్డేకు ముందే మ్యాచ్ ఆడకూడదని బ్రేవో బృందం పట్టుబడింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మ్యాచ్ జరగడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ హోటల్కు వెళ్లి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లతో పాటు రిచర్డ్సన్, ఆంబ్రోస్లతో కూడా వరుసగా మాట్లాడారు. ‘‘మ్యాచ్ లేకపోతే మాకు అవమానం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. వన్డే చూసేందుకు చాలా దూరంనుంచి అభిమానులు వస్తున్నారు. ఈ మ్యాచ్ జరగకపోతే వాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. తాను ఇంత చెప్పినా మ్యాచ్ నుంచి తప్పించుకోవాలనుకుంటే.. ఇక మీరు మా అతిథులు కారు.. మీకు మాకు సంబంధం లేదు.. మేమేమీ చేయలేం’ అని ఠాకూర్ అన్నట్లు సమాచారం. చివరకు చేసేదేమీ లేక బ్రేవో బృందం మ్యాచ్ ఆడటానికి ఒప్పేసుకుంది. కానీ తరువాత జరగబోయే మ్యాచ్ లను ఆడమని స్పష్టం చేస్తూ.. భారత్ పర్యటన నుంచి నిష్ర్కమించారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more