టీమిండియా క్రికెట్ జట్టు కేవలం ఇతర దేశాల్లోనే కాదు.. సొంతగడ్డపైనా ఇతర జట్ల చేతుల్లో ఘోరంగా విఫలమవుతారని తాజాగా నిరూపించేశారు. అప్పట్లో జరిగిన ఇంగ్లాండ్ టూర్ లో భారత్ టెస్టు మ్యాచుల్లో ఎంత దారుణంగా ఓటమి చవిచూసిందో అందరికీ తెలిసిందే! అలాగే ఈసారి వెస్టిండీస్ చేతిలో భారత్ సొంతగడ్డపైనే చిత్తుగా ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టులో మంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లు లేరు.. బాగా ఎక్స్ పీరియన్స్ వున్న సీనియర్ ఆటగాళ్లు అస్సలు లేనేలేరు.. కానీ భారత్ లో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు వున్నప్పటికీ వారి చేతుల్లో అత్యంత దారుణంగా పరాజయం పాలయ్యింది. సొంతగడ్డపైనే ప్రత్యర్థి జట్టుతో ఓడిపోయి మరోసారి ఇండియా గౌరవాన్ని మట్టికరిపించేశారు టీమిండియా ఆటగాళ్లు! కోచిలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది.
మొదట బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 322 పరుగులు చేసి భారత్ ఫీల్డర్లను బాగానే పరుగులు పెట్టించారు. తొలుత చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కరేబియన్ ఆటగాళ్లు.. రానురాను తమ వేగాన్ని పెంచుకుంటూ భారీ స్కోరువైపు దూసుకెళ్లారు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎవ్వరూ లేకపోయినప్పటికీ జూనియర్లు మాత్రం అద్భుతంగా తమ సత్తా చాటుకున్నారు. ఐపీఎల్ నేపథ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మార్లోస్ శ్యామ్యూల్.. అద్భుతంగా రాణించాడు. 116 బంతుల్లో 126 పరుగులు (11 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు శతకం చేస్తే... రామ్ దిన్ 59 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును జోడించడంలో ప్రముఖపాత్రను పోషించారు. దీంతో ఇన్నింగ్స్ మొత్తం పూర్తయ్యేలోపు వెస్టిండీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 321 పరుగుల భారీ స్కోరును సాధించింది.
ఇక 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు.. మొదట జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్తూ తమనుతాము నిలదొక్కుకోవడంలో సక్సెస్ అయ్యారు కానీ.. ఊహించని రీతిలో రహానే (24) ఔటయ్యాడు. ఇక ఇక్కడి నుంచి భారత్ ఆటగాళ్లు వరుసగా పవేలియన్ వైపు పరుగులు తీయడం మొదలుపెట్టారు. రహానే తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ కేవలం 2 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే అతని తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు కాస్త కుదురుకున్నాడుకునేంతలోపే అనవసరంగా షాట్ కొట్టి ఔటయ్యాడు. ఇక సురేష్ రైనా ఒఖ్క పరుగుకూడా చేయకుండానే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ 8 పరుగులు చేసి బౌల్డయ్యాడు. అయితే ధావన్ మాత్రం అర్థసెంచరీ సాధించి, తన సత్తా చాటుకున్నాడు. అలాగే కొనసాగుతాడని భావించిన తరుణంలో శామ్యూల్స్ బౌలింగ్ లో బౌల్డ్ య్యాడు. భువనేశ్వర కుమార్ (2), అమిత్ మిశ్రా (5), మోహిత్ శర్మ (8) ఇలావచ్చి అలా వెళ్లారు కానీ.. జడేజా 33 పరుగులు చేసి తమవంతు కీలకపాత్రను పోషించాడు. దీంతో 40 ఓవర్లలో టీమిడియా 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులకు ఆలౌట్ అయింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more