ఉప్పల్ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో అనుకోకుండా కొన్ని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోల్ కత ఓడిపోవడం ఖాయమని భావించిన తరుణంలో యువసంచలనం సూర్య అద్భుతంగా ఆటను ప్రదర్శించి మలుపు తిప్పేశాడు. తనలో వున్న ప్రతాపాన్ని చూపిస్తూ.. అలవోకగా సిక్సర్లు బాదుతూ కోల్ కతకు సంచలన విజయాన్ని అందించాడు. జట్టులో గంభీరమైన ఆటగాళ్లు వున్నప్పటికీ అందురూ చేతులెత్తేయడంతో ఈ యువక్రికెటర్ తనలో వున్న సత్తాను నిరూపించి.. జట్టును సెమీ ఫైనల్ కు తీసుకెళ్లాడు.
మొదట బ్యాటింగ్ కు బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అందులో వోగ్స్ ఆటగాడు ఒక్కడే అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు. 52 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) 71 పరుగులు సాధించాడు. ఇక 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత జట్టు మొదట చాలానే తబడింది. కెప్టెన్ గంభీర్, కలిస్ ఆటగాళ్లు రెండో ఓవర్ లోనే నిష్ర్కమించడంతో జట్టు ప్రమాదంలో పడిపోయింది. క్రీజులోకి వచ్చిన ఉతప్ప, మనీష్ పాండే, మనీష్ పాండే, డస్కాటే లాంటి ఆటగాళ్లు కూడా అంతంత స్కోరు మాత్రమే నమోదు చేసి వెనుదిరిగారు. దీంతో మొత్తం 15వ ఓవర్లో కోల్ కత 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే సాధించగలిగింది. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చేటప్పటికీ కోల్ కతా 35 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి వుంది.
సూర్య క్రీజులోకి వచ్చిరాగానే సిక్సర్లు బాదడం మొదలుపెట్టేశాడు. ఇతనిని చూసి చెలరేగిపోదామని అనుకున్న యూసుఫ్ పఠాన్ దెబ్బకు ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి వుండగా.. 19వ ఓవర్లో సూర్య రెండు సిక్సర్లు బాది జట్టును గాడిలో పడనీయకుండా కాపాడాడు. మిగిలిని చివరి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయాలి. అంతే.. కోల్ కత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కోల్ కతలో వున్న సీనియర్ ఆటగాళ్లు వెనుదిరిగినా.. సూర్య యాదవ్ ఏమాత్రం బెడియం లేకుండా జట్టును గెలిపించడంలో ప్రముఖపాత్రను పోషించాడు. దీంతో వరుసగా మూడువిజయాలతో 12 పాయింట్లు సాధించిన కోల్ కత.. సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more