Second test match between india and england teams in lords ground

second test match between india and england, indian team players, india cricket team captain dhoni, indian vs england cricket match, test match between india and england, india in lords ground, lords cricket ground in england, indian pace bowlers, england pace bowlers, india with england team, india cricket team

second test match between india and england teams in lords ground

‘‘లార్డ్స్’’లో నేడు భారత్-ఇంగ్లాండ్ ల మధ్య పోరాటం!

Posted: 07/17/2014 11:42 AM IST
Second test match between india and england teams in lords ground

నేడు భారత క్రికెట్ జట్టు కఠోర పరీక్షలో పాల్గొనబోతోంది. గతంలో వున్న గణాంకాలను తనదైన రీతిలో తిరిగరాసే సమయం ఆసన్నమైంది. భారత్ కు భూతంగా మారిన లార్డ్స్ మైదానంలో ఎటువంటి ప్రదర్శనను కనబరుస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఈ పిచ్ లో భారత్ కు ఒక్క విజయం కూడా లభించలేదు. అటువంటిది ధోనీ సేన ఎటువంటి ప్రతిభను ప్రదర్శిస్తుందోనని, ఈ కఠోర పరీక్షలో భారత్ నెగ్గగలదా అంటూ ప్రతిఒక్కరు ఆందోళనల్లో మునిగిపోయారు.

భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరు పొందిన లార్డ్స్ లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ సాగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.25 నిముషాలకు ప్రారంభం అవుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెటర్లు అద్భుతంగా ప్రదర్శించారు. కానీ వారు ఆ మ్యాచ్ ఆడింది జీవం లేని పిచ్ గ్రౌండ్ లో! నాటింగ్ హామ్ కు, లార్డ్స్ గ్రౌండ్ ల మధ్య చాలా వ్యత్యాసం వుంది. సీమర్లకు ఈ పిచ్ ఎంతో బాగా సహకరిస్తుంది. ఇటువంటి పిచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడం భారతీయ బ్యాట్స్ మెన్ కు ఒక పెను సవాలే అని చెప్పుకోవాలి.

2008-2014 మధ్యకాలంలోని గణాంకాల ప్రకారం... ఈ పిచ్ మీద పేసర్లు దాదాపు 165 వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్లు మాత్రం కేవలం 69 వికెట్లను మాత్రమే తీయగలిగారు. అంటే పేసర్లకు ఈ గ్రౌండ్ ఏ రేంజ్ లో సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. భారత్ తరఫున ఐదుగురు పేస్ బౌలర్లు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో స్టువర్ట్ బిన్నీ గత మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శించడం వల్ల ఇందులో కూడా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇక అశ్విన్, జడెజాల్లో ఎవరినో ఒకరినే తీసుకునే అవకాశం వుంది. ఇక ఇంగ్లాండ్ జట్టులో కూడా మంచి పేసర్లే వున్నారు.

మొదటి మ్యాచ్ లో అద్భుతంగా ప్రదర్శించిన భారత్.. ఇప్పుడు ఈ మ్యాచ్ ను కూడా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ జట్టులో వున్న బౌలర్లను సమయానుకూలంగా సరైన రీతిలో ఉయోగించుకుని ఆరంభించాలని యోచిస్తున్నారు. ఒకవైపు ధోనీ సేన అన్ని విధాలుగా బరిలోకి దిగుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ మాత్రం సరైన ఫామ్ లో కనిపించడం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే కుక్ పై వేటు పడే అవకాశాలు వున్నాయని బోర్డు మెంబర్లు పేర్కొంటున్నారు. ఏదేమైనా.. భారత జట్టు ఈ లార్డ్స్ మైదానంలో అద్భుతంగా ప్రదర్శించి, సరికొత్త రికార్డు సాధించాలని ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles