గత ఐపీఎల్ సీజన్ లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఈసారి కూడా అదే ఊపులో ఆటను కొనసాగించాలని ఎంతో ఉత్సాహంతో కొత్త సీజన్ ని మొదలు పెట్టినా ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది.
గత సీజన్లో బ్యాటింగ్ లో అంతంత మాత్రంగా రాణిస్తూ 130 నుండి 140 పరుగల మధ్య స్కోరు మాత్రమే చేసిన సన్ రైజర్స్ బౌలింగ్ ప్రతిభతో ఆరు మ్యాచ్ ల్లో నెగ్గింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో 133 పరుగులు చేస్తే గత సీజన్ లాగే గెలుస్తుందని అనుకున్నారు. బౌలర్లు ప్రారంభంలో వికెట్లు తీసినా ఆ తర్వాత లయ తప్పారు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ రహానే, స్టువర్ట్ బిన్నీలు బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది, ధావన్ 34 బంతుల్లో 38, వార్నర్ 35 బంతుల్లో 32 పరుగులు చేయడానికి బాగా కష్టపడ్డారు. రాజస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక పోయారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలో దిగిన రాజస్థాన్ జట్టు టాప్ ఆర్డర్ ను సన్ రైజర్స్ బౌలర్లు పేక మేడల్లా కూల్చి కష్టాల్లోకి నెట్టినా, అజింక రహానె 23 బంతుత్లో 59, స్టువర్ట్ బిన్నీ 48 నాటౌట్ తోడటంతో లక్ష్యాన్ని ఛేదించారు.హైదరాబాదు బౌలర్లు స్టెయిన్ 2, ఇషాంత్1 , భువనేశ్వర్ 1 వికెట్లు తీశారు. మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రహానేకు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more