బ్యాట్స్మెన్ హవాసాగే భారత జట్టులో కాస్త ఆశ్చర్యపరిచే విషయమే.. కానీ శుభసూచకం! అమిత్ మిశ్రా రూపంలో వరుసగా రెండోసారి బౌలర్కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది! పాకిస్థాన్పై తరహాలోనే వెస్టిండీస్పైనా బౌలర్లదే పూర్తి ఆధిపత్యమైంది. భీకరమైన బ్యాటింగ్లైనప్ ఉన్న వెస్టిండీస్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడింది. రైనా ఆన్నట్టుగా ఆ జట్టు బ్యాట్స్మెన్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు తెగ తంటాలు పడ్డారు.
దీంతో ఒకదశలో ఆ జట్టు 90-100 మధ్య స్కోరుకే పరిమితమవ్వొచ్చనిపించింది. టాస్ మరోసారి కలిసొచ్చినవేళ కెప్టెన్ ధోనీ మరోసారి అమిత్ మిశ్రా (4-0-18-2), జడేజా (4-0-48-3), అశ్విన్ (4-0-24-1)ల ధాటికి వెస్టిండీస్ 7 వికెట్లకు 129 పరుగులే చేయగలిగింది. గేల్ చేసిన 34 పరుగులే ఆ జట్టులో అత్యధికం. లెండిల్ సిమన్స్ 27 పరుగులు చేశాడు.
ఇక భారత్ తొలి ఓవర్లోనే ధవన్ (0) వికెట్ నష్టపోయినా, 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రోహిత్ (62 నాటౌట్; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), కోహ్లీ (54; 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీలతో ఛేజింగ్ను ఈజీ చేశారు.
ఇద్దరూ రెండో వికెట్కు 106 పరుగులు జోడించడం విశేషం. అయితే కోహ్లీ ఔటయ్యాక భారత్ విజయంపై కాస్త ఉత్కంఠ నెలకొంది. యువరాజ్ (10; 19 బంతుల్లో ఒకఫోర్) మందకొడి బ్యాటింగ్తో మ్యాచ్ ఆఖరు ఓవర్కు దారితీసింది. ఆఖరు ఓవర్లో విజయానికి ఒక పరుగే అవసరమైంది.
శామ్యూల్స్ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతుల్ని డిఫెన్స్ ఆడిన యువీ, మూడో బంతికి ఔటయ్యాడు. అయితే క్రీజులోకొచ్చిన రైనా ఒత్తిడికి గురవ్వలేదు. తానెదుర్కొన్న తొలి బంతినే పాయింట్ దిశగా సింగిల్ తీశాడు. మరో రెండు బంతులు మిగిలిన దశలో భారత్ ఛేజింగ్ను పూర్తిచేసినా, ఈ మ్యాచ్లో భారత్ ఆధిపత్యం సాధించిన తీరు ఇటీవల కాలంలో అభిమానుపూన్నడూ చూసి ఎరుగరు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more