న్యూజిలాండ్ తో నేడు జరిగిన మూడో వన్డేలో భారత జట్టుకు ‘చావు తప్పి కన్ను లొట్టపోయింది’చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో సిరీస్ పై ఆశలు కోల్పోకుండా నిలుపుకుంది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ వన్డేలో చివరి వరకు పోరాడి అతి కష్టం మీద టై చేసింది. 315 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 314 మాత్రమే చేయగలిగింది.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(39), శిఖర్ ధావన్(28) తొలి వికెట్ కి 64 పరుగులతో మంచి శుభారంబాన్ని ఇచ్చారు. కానీ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ కోహ్లీ, రహానే వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం భారత్ కష్టాల్లో పడింది. తరువాత వచ్చిన సురేష్ రైనా (31) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ధోని (50), రవిచంద్రన్ అశ్విన్ (65) పరుగులు చేసి మిడిల్ ఆర్డర్ లో రాణించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో మళ్ళీ కష్టాల్లో పడింది.
చివర్లో రవీంద్ర జడేజా విజయతీరాలకు తీర్చడానికి ఒంటరి పోరాటం (66) పరుగులు చేసినా ఫలితం తేల్చలేక పోయాడు. అంతకు ముందు భారత ఫేస్ విభాగం పై కివీస్ బ్యాట్స్ మెన్స్ విరుచుకు పడ్డారు. నేటి జట్టులోకి వరుణ్ అరోన్ ని తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ (111) తో రాణించాడు. అతనికి తోడు విలియమ్పస్ (65) కూడా తోడవ్వడంతో కివీస్ 314 భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో అండర్సన్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో కివీస్ 2-0 తో ముందంజలో ఉంది. నాల్గొ వన్డే 28న హమిల్టన్ లో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more