షార్జాలో జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్ళు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ సొంతం చేసుకోడమే కాకుండా లీగ్ దశలో ఓడిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు. టైటిల్ పోరులో భాగంగా జరిగిన ఫైనల్స్ లో భారత్ దాయాది పాక్ పై 40 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సాధించారు.
భారత జట్టు కుర్రాళ్ళలో భవిష్యత్తు ఆశాకిరణాల్లా కనిపిస్తున్న విజయ్ జోల్, సంజు శాంసన్ సెంచరీల ధాటికి పాకిస్థాన్ జట్టు పరాజయం పాలవ్వక తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కేరళ తాజా యువసంచలనం సంజు శాంసన్ (100) , కెప్టెన్ విజయ్ జోల్ (100) శతకాలతో అదరగొట్టడంతో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లరో ఎనిమిది వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారీ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 274 పరుగులు మాత్రమే చేసింది. కమ్రాన్ గులామ్ 102, సమి అస్లామ్ 87 పరుగులు చేసినా జట్టుకు విజయాన్ని అందించలేక పోయారు. భారత భౌలర్లలో కుల్ దీప్ యాదవ్ మూడు వికెట్లు, మిలింద్, హుడా, గని రెండేసి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ కప్ లో జోల్, సంజు శాంసన్ జాతీయ సెలక్టర్ల మనస్సులో స్థానం సంపాదించారు. అతి త్వరలోనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more