నేడు క్రికెట్ అభిమానులకు రెండు పండగలు. ఒక దీపావళి కాగా... మరొకటి ఆసీస్ - భారత వన్డే సిరీస్ లో ఫైనల్ మ్యాచ్. ఒకవైపు పటాకుల మోత మోగుతుంటే మరోవైపు పరగుల వరద పారనుంది. నేడు బెంగుళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ని ఎలాగైనా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని రెండు జట్లు కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో పరుగుల వరద, భారీ లక్ష్యాలను చేధించిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో అదే జోరును కొనసాగించి స్వదేశంలో సిరీస్ ను గెలిచి భారత అభిమానులకు దీపావళి కానుకగా ఇవ్వాలని పట్టుదలతో ఉంది.
ఈ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని క్యూరేటర్లు చెబుతున్నారు. ఈ పిచ్ సీమర్లకు, స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించక పోవచ్చని, బౌలర్లు బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయకపోవచ్చని అంటున్నారు. ఇక టీం ఇండియా విషయానికి వస్తే... జైపూర్ టు నాగ్పూర్... బంతి తగిలితే బౌండరీ... క్రీజు వదిలితే సిక్సర్ అన్నట్లుగా విధ్వంసకాండ సృష్టించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ ఈ మ్యాచ్పై కూడా దృష్టిసారించారు. ఓపెనింగ్లో రోహిత్, ధావన్ల శుభారంభానికి కోహ్లి మంచి ఫినిషింగ్ ఇవ్వడం భారత్కు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్లో ధోని విశేషంగా రాణిస్తుండటం భారత్కు అదనపు బలం.
లోయర్ ఆర్డర్లో పరుగులు రాబట్టే బ్యాట్స్మన్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, మహ్మద్ షమీ ఆరంభంలో వికెట్లు తీసినా చివర్లో పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. ఆస్ట్రేలియా జట్టులో కూడా దుమ్మురేపే బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. బెయిలీ ప్రతి మ్యాచ్ లో ఆకట్టుకుంటుండగా, బౌలర్లు కూడా సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తున్నారు. ఈ వన్డేలో ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ లేకపోవడంతో భారత్ కి కలిసి వచ్చే అంశం. మొత్తానికి సిరీస్ ఎవర్ని వరిస్తుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more