ఐపీఎల్ సీజన్ 6లో భారీ ఫిక్సింగ్ జరిగినట్లు ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, చెన్నై జట్ల విషయంలో రుజువైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సంచలన వార్త బయటకు వచ్చింది. గత సీజన్ లోనే కొత్తగా అడుగు పెట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కూడా ఫిక్సింగ్ కి పాల్పడినట్లు బుకీ పటేల్ పోలీసులకు వెల్లడించడంతో ఈ వార్త సంచనలం రేపుతుంది. ఇప్పటికే శ్రీశాంత్ పై జీవిత కాల నిషేదం విధించగా, మరో ఇద్దరి ఆటగాళ్ళకు కూడా శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కి పాల్పడ్డారని ముంబై పోలీసుల విచారణలో బుకీ చెప్పడం, దాన్ని ఛార్జిషీట్లో చేర్చడం పెద్ద సంచలనం రేపుతుంది. సన్రైజర్స్కు చెందిన నలుగురు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డట్టు చంద్రేష్ శివ్లాల్ పటేల్ అనే బుకీ ముంబై పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. ఏప్రిల్ 17న పుణె వారియర్స్తో జరిగిన మ్యాచ్ను సన్రైజర్స్ ఆటగాళ్లు తిసార పెరెరా, హనుమ విహారి, ఆశిష్ రెడ్డి, కర్ణ్ శర్మలు కలిసి రూ. 6 కోట్లకు ఫిక్స్ చేశారని పటేల్ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు వెల్లడించాడని హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పత్రిక డెక్కన్ క్రానికల్ తెలిపింది. బుకీ ఇచ్చిన స్టేట్ మెంటు ప్రకారం.. ఏప్రిల్ 16న సునీల్ అనే వ్యక్తి మాకు సన్రైజర్స్ ఆటగాళ్లు పెరెరా, విహారి, కర్ణ్ శర్మ, ఆశిష్ రెడ్డి అతని సోదరుడు ప్రీతమ్ రెడ్డిలను పరిచయం చేశాడు. మేం ఏం చేయాలని ప్రీతమ్ రెడ్డి అడిగాడు. మొదటి 10 ఓవర్లలో స్కోరు 60, 20 ఓవర్లు ముగిసే సరికి 140 పరుగులు దాటకూడదు. హైదరాబాద్ ఓడిపోవాలని డీల్ కుదుర్చుకున్నాం. ఆ తర్వాత రోజు ఆమిర్ ఫోన్ చేసి రెండో ఓవర్లో హైదరాబాద్ ఆ టగాడు అవుటవుతాడు అదే సిగ్నల్ అనిచెప్పాడు. అన్నట్టుగానే రెండో ఓవర్లో హైదరాబాద్ ఆటగాడు అవుటయ్యాడు. తొలి పది ఓవర్లలో జీతూ (బుకీ) రూ. 3.5 కోట్లు, మ్యాచ్ మొత్తమ్మీద రూ. 9 కోట్లు బెట్ పెట్టాడు. తొలి 10 ఓవర్లలో బెట్ నెగ్గాడు కానీ, ఆ తర్వాత హైదరాబాద్ నెగ్గడంతో నష్టపోయాడు అని పటేల్ తన స్టేట్మెంట్లో ఆరోపించాడు. అయితే శ్రీలంక ఆటగాడు పెరారీ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడనే ఆరోపణల పై ఆ బోర్టు స్పందించి ఇవన్నీ నిరాధారణమైనవని తేల్చింది. ఇటు సన్ రైజర్స్ మేనేజర్ షణ్ముగం వీటిని కొట్టి పారేశాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more