టీం ఇండియా విదేశీ గడ్డ పై ఆటతీరు అంతంతే అని మరోసారి నిరూపించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాం కదా ... ట్రై సిరీస్ ని వదిలేద్దాం అనుకుందో ఏమో కానీ విండీస్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో రెండు వరుస మ్యాచ్ ల్లో ఓడిపోయింది. నిన్న రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 161 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ లంకను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అసలే కసిమీద ఉన్న లంక జట్టు ఆది నుండి దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లను ఛీల్చి చెండాడారు. ఫలితంగా భారీ 348 పరుగుల భారీ స్కోరును సమర్పించుకున్నారు. ఓపెనర్లు తరంగ (159 బంతుల్లో 174 నాటౌట్; 19 ఫోర్లు; 3 సిక్స్లు), జయవర్ధనే (112 బంతుల్లో 107; 9 ఫోర్లు; 2 సిక్స్లు) శతకాలతో రెచ్చిపోయారు. భారత బౌలర్లు బ్యాట్స్ మెన్స్ ని ఏ మాత్రం కట్టడి చేయలేక పోయారు.
శ్రీలంక నిర్ధేశించిన 349 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 187 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత జట్టుపై 161 పరుగుల భారీ తేడాతో శ్రీలంక విజయం సాధించింది. భారత జట్టులో జడేజా ఒక్కడే ఒంటరి పోరాటంతో (49) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రైనా (33), విజయ్ (30), ధావన్ (24), కార్తీక్ (22) రాణించక పోవడంతో తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక జట్టులో హెరాత్ 3, సేనా నాయకే, మలింగ రెండేసి, కులశేఖర, మ్యాథ్యూస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శన అన్ని విభాగాల్లో విఫలం అయింది. తొలి వికెట్కు 213 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. 107 బంతుల్లో జయవర్ధనే కెరీర్లో 16వ సెంచరీ నమోదు చేశాడు. చివర్లో మాథ్యూస్ (29 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) సహాయంతో తరంగ బౌండరీల వరద పారించడంతో లంక భారీ స్కోరు అందుకుంది. చివరి 16 ఓవర్లలో శ్రీలంక ఏకంగా 180 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్లో భారత్ తరుఫున కెప్టెన్ ధోని స్థానంలో విజయ్, పేసర్ భువనేశ్వర్ స్థానంలో షమీ అహ్మద్ బరిలోకి దిగారు. కోహ్లి సారథ్యం వహించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more