ఈ సీజన్ లో అంత్యంత ఫేవల ప్రదర్శన చేస్తూ, అప్పుడప్పుడు అనూహ్య విజయాలు సాధిస్తున్న ఢిల్లీ జట్టు రాజస్టాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ ఓటమి పాలైయింది. ఆ మధ్యలో ముంబయి జట్టు పై, మొన్న కోల్ కత్తా పై విజయాన్ని నమోదు చేసుకొని గాడిలో పడిందనుకున్న ఈ జట్టు హైదరాబాద్ పై, రాజస్థాన్ పై వరుస ఓటముల పాలైంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి ఇంటి దారి పట్టడానికి సిద్ధమైంది. నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.. ఈ మ్యాచ్ లో డేర్డెవిల్స్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఓపెనర్ జయవర్ధనే బాధ్యతాయుత ఇన్నింగ్స్తో వ్యక్తిగత 34 పరుగులు నమోదు చేయగా.. సెహ్వాగ్ మరోసారి విఫలమై 11 పరుగులకే పెవీలియన్కు చేరాడు. అనంతరం మురళీధరన్ గౌతమ్ (2), డెవిడ్ వార్నర్ (13) తక్కువ పరుగులకే చేతులెత్తేశారు. దీంతో కేలవం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ నిర్ధేశించిన 154 పరుగుల విజయ క్ష్యాన్ని రాజస్థాన్ జట్టు కేవలం 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. రహనేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రవిడ్ (53; 48 బంతుల్లో 7 ఫోర్లు) తొలి వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అతనికి పూర్తిగా సహకరించిన రహనే కేవలం 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 63 పరుగులు నమోదు చేసి అజేయంగా నిలిచాడు. రెండో వికెట్ గా బరిలోకి దిగిన వాట్సన్ రహనేతో పాటు బ్యాట్ ఝులిపించి కేవలం 14 బంతుల్లో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల స్కోరు సాధించిన రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన వియాన్ని నమోదు చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more