హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు పటిష్ట జట్టుగా పేరున్న ముంబయి ఇండియన్స్ ని చిత్తు చేసింది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా నేడు రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ముంబయి ఇండియన్స్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేసింది. కేవలం నాలుగు వికెట్లే కోల్పోయినా, 130 పరుగుల విజయ లక్ష్యాన్నే హైదరాబాద్ ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన సన్ రైజర్స్ జట్టు 130 పరుగుల లక్ష్యాన్ని 12 బంతులుండగానే 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. సన్ రైజర్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ అత్యధికంగా 55 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. విహారీ 25, కెప్టెన్ సంగక్కర 21 పరుగులు చేసి అవుటయ్యారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ధావన్ కి దక్కింది. ముంబయి బౌలింగ్ లో జాన్సన్, కులకర్ణి, హర్బజన్ తలో వికెట్ తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more