ఐపీఎల్ సీజన్ 6లో ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోకుండా, అతిపేవలంగా ఆడుతున్న రెండు జట్లు అయిన ఢిల్లీ డేర్ డెవిల్స్ , పూణె వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ అధ్బుత ప్రతిభ కనబర్చి మ్యాచ్ ని చేజిక్కుంచుకుంటే , గెలవాల్సిన మ్యాచ్ ని చేజేతులా పోగొట్టుకొని పూణె ఉన్న కాస్తంత పరువును మరింత దిగజార్చుకుంది. మంచి మంచి ఆటగాళ్ళు ఉన్న ఢిల్లీ జట్టులోని ఆటగాడు అయిన డేవిడ్ వార్నర్ తన ప్రతాపాన్ని పసికూనలు అయిన పూణెపై చూపించి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. కొత్త వేదిక రాయ్పూర్లో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో డేర్డెవిల్స్ 15 పరుగుల తేడాతో పుణేవారియర్స్ను ఓడించింది.
టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.టాప్ ఆర్డర్ ఫర్వాలేదనిపించినా, డేవిడ్ వార్నర్ (25 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో జట్టుకు గైరవ ప్రదమైన స్కోరును అందించాడు. పుణే వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు ఉతప్ప (33 బంతుల్లో 37; 4 ఫోర్లు), ఫించ్ (33 బంతుల్లో 37; 5 ఫోర్లు) తొలి వికెట్కు 76 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వీళ్లిద్దరూ ఓకే ఓవర్లో అవుటైనా... యువరాజ్ సింగ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు), లూక్ రైట్ (18 బంతుల్లో 19; 3 ఫోర్లు) కలిసి నిలకడగా ఆడారు. ఈ దశలో పుణే విజయం ఖాయమనిపించింది. విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన దశలో.. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో ఈ ఇద్దరూ అవుటయ్యారు. ఈ రెండు వికెట్లతో సీన్ మారిపోయింది. స్మిత్ (8 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడినా పూణె జట్టును ఓటమి నుండి తప్పించలేక పోయారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more