భారత ఆశాకిరణం.. ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి.. సైనా నెహ్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని తాను బాడ్మింటన్లో ముందడుగు వేస్తున్నానని భారత టీనేజ్ సంచలనం పివి సింధు పేర్కొంది. సైనా సాధించిన విజయాలు, అధిరోహించిన శిఖరాలు సామాన్యమైనవికాదని సింధు తెలిపింది. ప్రస్తుతం తనకు ఫిట్నెస్ సమస్య లేదని, గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, అంతర్జాతీయ వేదికలపై రాణించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సింధు చెప్పింది. కాలి మడమ గాయం కారణంగా జపాన్లో జరిగిన ప్రపంచ జూనియన్ బాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొనలేకపోయిన ఈ 17 ఏళ్ల షట్లర్ ఇప్పుడు తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్య లేదని స్పష్టం చేసింది.
ఇటీవల చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ క్వార్టర్ ఫైనల్స్ లో లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురెయ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో టైటిల్ అందుకోలేకపోయినప్పటికీ, కడవరకూ పోరాటం సాగించే ప్రతిభగల క్రీడాకారిణిగా సింధు పేరు సంపాదించింది. లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్ తర్వాత ఆ స్థాయిలో రాణించే సత్తావున్న సింధు కూడా హైదరాబాదీనే కావడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్లో ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆమె టాప్-20లో స్థానం సంపాదించింది.
కాగా, తన ర్యాంక్ను మరింత మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్నట్టు సింధు పేర్కొంది. సైనా తర్వాత అంతటి సామర్థ్యంగల క్రీడాకారిణిగా తనను గుర్తించడం సంతోషంగానే ఉన్నప్పటికీ, ఆ స్థాయికి చేరాలంటే తాను ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలిపింది. పట్టుదలతో అవిశ్రాంతంగా కృషి చేస్తేనే ఒక్కో మెట్టు ఎక్కడం సాధ్యమవుతుందని చెప్పింది. ప్రతి మ్యాచ్లోనూ విజయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎత్తు తనకు లాభించే అంశాల్లో ఒకటని 5 అడుగుల 10 అంగుళాల పొడవు ఉన్న సింధు చెప్పింది. బలమైన స్ట్రోక్స్కు, శక్తివంతమైన స్మాష్లకు ఎత్తు ఎంతగానో సహకరిస్తుందని స్పష్టం చేసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more