ట్వంటీ-20లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన రెండో ట్వంటీలో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ట్వంటీ-20లో ఓటమి పాలైన భారత్ ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను సమం చేసింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ బౌలర్లకు భారత బ్యాట్స్ మెన్స్ చుక్కలు చూపించారు. చాలా రోజుల తరువాత మనవాళ్ల బ్యాటింగ్ పవరేంటో మరో సారి తెలియజెప్పారు. ఓపెనర్స్ బ్యాట్స్ మెన్స్ గంభీర్, రహానేలు చక్కని ఓపెనింగ్ ఇచ్చారు. గంభీర్ 21 పరుగులు, రహానే 28 పరుగులు చేసి అవుటయ్యారు. తరువాత వచ్చిన యువరాజ్ సింగ్, ధోనిలు పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యువరాజ్ 36 బంతుల్లో 72 పరుగులు చేయగా, ధోని అతనికి చక్కని సహారం అందించి 33 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ 192 పరుగులు ఐదు వికెట్లు కోల్పోయి చేసింది. ఇక పాక్ ముందు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాక్ కూడా ధీటుగానే ఆడినా, చివర్లో చతికిలబడింది. ఓపెనర్ జంషెడ్ (41), అహ్మద్ షహ్జాద్ (31) పరుగులతో శుభారంభాన్నిచ్చారు. ఈ జోడి పెవిలియన్కు చేరిన అనంతరం కెప్టెన్ హఫీజ్ (55), ఉమర్ అక్మల్ (24) రాణించినా ఫలితం దక్కలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల చేసిన పాక్ పరాజయం చవిచూసింది. భారత్ బౌలర్లలో దిండా మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అశ్విన్, యువరాజ్లకు తలో వికెట్టు లభించింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, ఈ సిరీస్లో ఆకట్టుకున్న హఫీజ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more