గ్రామీణ స్థాయిలోని మట్టిలో మాణిక్యాలకు అండగా నిలిచేందుకు కేంద్ర క్రీడాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం స్పోర్ట్స్ యూనివర్శిటీలు, స్పోర్ట్స్ స్కూళ్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 61వ అఖిల భారత పోలీస్ చాంపియన్షిప్ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్పోర్ట్స్ స్కూళ్లు, స్పోర్ట్స్ యూనివర్శిటీలతో పాటు దేశవ్యాప్తంగా 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి క్రీడా శాఖ ఏర్పాట్లు చేస్తోందని ఆయన చెప్పారు. వీటిలో క్రీడలకు అవసరమైన సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాగా, పోలీసు క్రీడలు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజులు జరుగుతాయి. రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్, జూడో, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్ తదితర క్రీడలకు సంబంధించిన పోటీలు జరుగుతాయి. సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, మకావ్ గ్రాండ్ ప్రీ రేస్లో విషాదం చోటు చేసుకుంది. హాంకాంగ్ డ్రైవర్ ఫిలిప్ యావూ (40) నడుపుతున్న కారు ప్రమాదానికి లోనుకావడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మకావ్ గ్రాండ్ ప్రీ నిర్వాహకులు ఈ ప్రమాదంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయతే, టీవీ ఫుటేజీల్లో ఫిలిప్ నడిపిస్తున్న చెవర్లట్ క్రూజ్ కారు ప్రమాద వశత్తు పల్టీలు కొట్టింది. అదే సమయంలో మంటలు చెలరేగడంతో ఫిలిప్ బైటపడే అవకాశం లేకపోయంది. ఇటీవలే జరిగిన ప్రమాదంలో పోర్చుగీస్ మోటార్బైక్ రేసర్ లూయస్ కారిరా దుర్మరణం చెందగా, మరో ప్రమాదం చోటు చేసుకోవడం మోటార్ స్పోర్ట్స్లో భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తున్నది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more