భారత డబుల్స్ జోడీ మహేష్ భూపతి, రోహన్ బొపన్న పారిస్ మాస్టర్స్ ఓపెన్ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకుని ఈ సీజన్లో రెండో ఎటిపి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ దూరాన్ని తుడిచేస్తూ భారత్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారీ జంట. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతోన్న ఈ టోర్నీలో సీజన్లో చివరి మాస్టర్స్ టోర్నీ పారిస్ ఓపెన్లో భారత జోడి మహేశ్ భూపతి-రోహన్ బోపన్న టైటిల్ సాధించింది. రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భూపతి-బోపన్న ద్వయం 7-6 (10/8), 6-3తో ఐజామ్ ఉల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) -జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్లో రెండు జోడిలు తమ సర్వీస్లను నిలబెట్టుకున్నాయి. టైబ్రేక్లో భూపతి జంట పైచేయి సాధించింది. అటు రెండో సెట్లో తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయిన భారత జోడి ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసి మ్యాచ్ను సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన భూపతి-బోపన్నలకు లక్షా 42 వేల 500 యూరోలు (రూ. 98 లక్షల 42 వేలు) ప్రైజ్మనీగా లభించింది.
కాగా, వీరిరువురూ జోడి కట్టాక భూపతి-బోపన్నలకిది రెండో టైటిల్. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్ ఓపెన్ను వీరిద్దరూ గెల్చుకున్నారు. ఓవరాల్గా భూపతి కెరీర్లో ఇది 51వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత ఏడాది ఖురేషితో కలిసి పారిస్ ఓపెన్ను నెగ్గిన బోపన్న ఈసారి భూపతితో కలిసి నిలబెట్టుకొని కెరీర్లో ఏడో టైటిల్ను జమ చేసుకున్నాడు. తాజా విజయంతో భారత్ తరఫున అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా లియాండర్ పేస్, మహేశ్ భూపతి 51 టైటిల్స్తో సమఉజ్జీగా ఉన్నారు.
కాగా, సెమీస్లో ఐదో సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ 7-5, 6-3 స్కోరుతో ఆస్ట్రేలియన్, బ్రిటన్ జోడీ పాల్ హాన్లీ, జొనాథన్ మార్రీ కంగుతినిపించింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more