ఆ కేంద్ర మంత్రి అక్కీని ఎందుకు అంతలా పొగిడాడు? | Why Rajnath Singh Praised Akshay kumar.

Akshay kumar donates rs 1 08 crore to martyred jawans kin

Akshay Kumar, Union Minster Rajnath Singh, Akshay Kumar Rajnath Singh, Akshay Kumar Donation, Sukma CRPF Martyrs, Rajnath Singh Praise Akshay Kumar, Star Hero Akshay Kumar, Akshay Kumar Desh Bhakthi, Akshay Kumar 1 Crore Donation, Akshay Kumar Martyred Jawans

Bollywood Star Hero Akshay Kumar Did it Again. Donates Rs 1.08 crore to Sukma CRPF martyrs' families. Home Minister Rajnath Singh lauds it.

సీఆర్ఫీఎఫ్ కుటుంబాలకు అక్షయ్ సాయం.. రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు

Posted: 03/17/2017 09:48 AM IST
Akshay kumar donates rs 1 08 crore to martyred jawans kin

దేశభక్తి అంటూ సినిమాల్లోనే కాదు, బయటా ఉపన్యాసాలు , సోషల్ మీడియాలో ట్వీట్లతో ఊదరగొట్టే సెలబ్రిటీలను చూస్తూనే ఉన్నాం కానీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాత్రం మాటల మనిషి కాదు. తనకు దేశంపై ఎంత ప్రేమ ఉందో ఎప్పటికప్పుడు చేతల్లోనే చూపిస్తుంటాడు. రీసెంట్ గా(మార్చి 11న) ఛత్తీస్ గఢ్ లో సుక్మా లో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించి ప్రశంసలు అందుకుంటున్నాడు.

అక్షయ్ దాతృత్వంపై సీఆర్పీఎఫ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఈ మొత్తాన్ని ఇచ్చారని అఫీషియల్ ట్విట్టర్ లో పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.9 లక్షల చొప్పున మొత్తం కోటి 8 లక్షలు విరాళంగా ఇచ్చాడని తెలిపింది. అక్కీ తన దేశభక్తిని చాటుకున్నారని, ఆయనకు సీఆర్పీఎఫ్ సగర్వంగా సెల్యూట్ చేస్తోందని ఆ ట్వీట్ లో పేర్కొంది.

ఇక ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా అక్షయ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అక్షయ్ చేసిన సాయం అమర జవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని ఆయన తెలిపాడు. ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అక్షయ్ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. దేశంపై అక్షయ్ కు ఉన్న ప్రేమాభిమానాలు ఏపాటిదో ఈ ఉదంతం వెల్లడిస్తోందని మీడియాతో తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  Sukma Encounter  CRPF Martyrs  Donation  Rajnath Singh Praise  

Other Articles