దేశీయ స్టాక్ మార్కెట్లను ఇవాళ నష్టాలు ముంచెత్తాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు, అమెరికా కేంద్రీయ బ్యాంకు ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరపతి విధాన సమీక్షకు పూనుకోవడంతో పాటు ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలను నష్టాలు ముంచెత్తాయి, నిన్నటి లాభాలతో ఏకంగా ఏడు మాసాల గరిష్ట స్థాయిని తాకిన మార్కెట్లు ఇవాళ మూడు వారాలలో అత్యంత అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అదే దిశలో పయనిస్తూ చివరకు నష్టాలతోనే ముగిశాయి.
ఇవాళ ఉదయం ప్రారంభంతోనే దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 91 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 27,000 పాయింట్లకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 36 పాయింట్లను ఉదయాన్నే కోల్పోయింది. దీంతో 27 వేల మార్కును సెన్సక్స్ కోల్పగా, నిఫ్టీ మాత్రం 8200 మార్కును నిలబెట్టుకుంది, 257 పాయింట్లు నష్టపోయి 26 వేల 763 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 69 పాయింట్లు నష్టపోయి 8 వేల 204 వద్ద ముగిసింది.
ఇవాళ్లి ట్రేడింగ్ లో మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్యలకు చెందిన షేర్లు లాభాలను అర్జించగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంజీసీ, అటో, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ షేర్లు అధిక నష్టాలను మూటగట్టుకోగా, మిగిలిన అన్ని సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా తో పాటు రిలయన్స్,బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీలు తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఇన్ఫోసిస్, అంబుజా సిమింట్స్, హిందుస్థాన్ యూనీ లివర్ , హీరో మోటో కార్ప్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more