పన్ను చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. పన్ను చెల్లింపు విషయంలో వసూలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని పలుసార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి (సీబీడీటీ) ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించేందుకుగాను ఈ-మెయిల్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. నోటీసులు పంపించడం తిరిగి వాటికి బదులు ఇచ్చే అవకాశం ఉండేలా ఈ-మెయిల్ సిస్టాన్ని తయారు చేయాలని ఇప్పటికే ఐటీ శాఖకు సీబీడీటీ ఆదేశించింది.
గత కొంతకాలంగా పన్నులు చెల్లించేందుకు తేలికైన మార్గాలను అన్వేషిస్తున్నాం..ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నాం..అందుకే పన్ను చెల్లింపుదారులకు ఈ-మెయిల్ పంపించేలా, దానికి తిరిగి సమాధానం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని సీబీడీటీ చైర్మన్ అనితా కపూర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. పన్ను వసూలు చేసేటప్పులు తలెత్తే ఇబ్బందులు, పన్ను చెల్లింపుదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పుకు శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుడికి పేపర్ డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. కొత్త విధానం అందుబాటులోకి వస్తే క్షణాల్లో నోటీసులు, ఇతర వాటిని పంపేందుకు వీలుపడనున్నది. అసెసింగ్ ఆఫీసర్కు పన్ను చెల్లింపుదారుడికి మధ్య ఎవరికి సంబంధం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకరావడం జరిగిందని, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే కూడా ఈ-మెయిల్ పంపవచ్చునని ఆమె ఈ సందర్భంగా సూచించారు. పన్ను చెల్లింపునకు చెందిన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more