విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు దేశీయ సూచీలలో నెలకొన్న స్థబతతో వరుసగా రెండు రోజుల పాటు లాభాలను ఆర్జించిన భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలలో ముగిసాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో ఉదయం మార్కెట్ ప్రారంభం అయినప్పటి నుంచే నష్టాలను చవిచూశాయి. ఇక ఇటు దేశీయ మదుపరుల సెంటిమెంట్ కూడా ప్రతికూలంగా మారండంతో స్టాక్ మార్కెట్లు ఉదయం పది గంటలకు భారీ నష్టాలలోకి జారుకున్నాయి. అయితే సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెలువరించిన తాజా ప్రకటన నేపథ్యంలో పుంజుకున్నప్పటికీ స్టాక్ మార్కెట్లను మాత్రం నష్టాలు వదలలేదు.
చైనా అర్థిక సంక్షోభం నేపథ్యంలో మరోమారు ద్రవ్యోల్భణానికి దారితీస్తుందన్న సంకేతాల ప్రభావం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో పాటు త్వరలో కీ మాక్రో డాటాను ఐఐపి విడుదల చేయనుందన్న వార్తలు, అటు వినియోగదారు ధర ద్రవ్యోల్బణాన్ని కూడా కేంద్రం వెలువరించనుందన్న సంకేతాలు మదుపరుల సెంటిమెంట్లను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మార్కట్లను పుంజుకునేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వస్తు, సేవా పన్నుల బిల్లును బీహార్ ఎన్నికల అనంతరం రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో అమోదించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించిన తరువాత కాస్త పుంజుకున్న మార్కట్లను మాత్రం నష్టాలు వద్దల్లేదు.
ఉదయం 25 వేల 523 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెస్సెక్స్ ఒక ధశలో సుమారుగా 300 పాయంట్లను కోల్పయింది. ఆ తరువాత 25 వేల 733 పాయంట్లను తాకి 97 పాయంట్ల నష్టంతో తిరిగి 25 622 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 31 పాయింట్ల నష్టంతో 7788 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ సుమారు 1122 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 1482 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, మధ్య తరహా పరిశ్రమలు సూచీలు లాభాలను ఆర్జించగా, టెక్నాలజీ, కన్జూమర్ గూడ్స్, లోహాం, ఐటీ, నిఫ్టీ బ్యాంకింగ్, , హెల్త్ కేర్ ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, సంబంధిచిన సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో టాటాపవర్, టాటామోటార్స్, బిసిసిఎల్, బిహెచ్ఇఎల్, జీ ఎంటర్టైన్మెంట్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, ఎన్ ఎం డి సి, హెచ్ సి ఎల్ టెక్నాలజీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, హెచ్ డి ఎఫ్ సి సహా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more