Sensex closes 242 points down, Nifty ends at 2-month low on weak global cues

Sensex nifty hit 9 week closing low

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

rupee tumbled to a fresh 2-year low nearing the 66 mark a dollar on weakness in equity market. The currency depreciated by 33 paise to 65.87 a dollar.

తొమ్మిది వారాల కనిష్టస్థాయికి మార్కెట్లు.. పతనం అంచున రూపాయి

Posted: 08/21/2015 07:11 PM IST
Sensex nifty hit 9 week closing low

రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతున్న నేపథ్యంలో.. దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆగస్టులో వరసగా చవిచూస్తున్న నష్టాలతో మార్కెట్లు తొమ్మిది వారాల కనిష్ట స్థాయికి చేరాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు స్టాక్ మార్కెట్లను కోలుకోనీయని దెబ్బతీస్తున్నాయి. కాగా దీనికి తోడు చైనా ఆర్థిక సంక్షోభం కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుని కోలుకునేందుకు తమ కరెన్సీ యవాన్ విలువను తగ్గించడంతో దాని ప్రభావం రూపాయిపై పడి రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి రూపాయి విలువ చేరింది.

రూపాయి మారకం విలువ రోజురోజుకు మరింత పతనం అవుతూ.. క్రమంగా పడిపోతుంది. రూపాయి మారకం విలువ అమెరికన్ డాలరుతో పోల్చేతే 66 రూపాయల మార్కు చేరువలో ట్రేడింగ్ సాగిస్తోంది. ఇవాళ 33 పైసల మేర క్షీణించిన రూపాయి మారకం విలులు మార్కెట్లు ముగిసే సమయానికి 65 రూపాయల 87 పైసల వద్ద ముగిసింది. దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదోడుకులను ఎదుర్కోని తొమ్మిది వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. నిష్టీ 8300 మార్కుకు దిగువన ముగిసింది. ఉదయం నుంచి  మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 27,366 దగ్గర,  నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 8,300 వద్ద ముగిసింది.. ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్ సూచీల మినహా అన్ని సూచీలు నష్టాలను చవిచూశఆయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, అటో, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, సూచీలు అధికంగా నష్టాలను చవిచూశాయి. అటు మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనీట్స్, టెక్నాలజీ, చిన్నతరహా, మద్య తరహా సూచీలు కూడా నష్టాల బాటలో పయనించాయి.  ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ సూచీలు మాత్రం లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో హెచ్ యు ఎల్, అంబుజా సిమెంట్స్, ఇన్ఫోసిస్, హిండాల్కో, పిప్లా తదితర సంస్థలు షేర్లు అధిక లాభాలను గడించగా, వేదంతా, యస్ బ్యాంక్, బజాజ్ అటో, ఐడియా సెల్యూలార్, ఇండస్ ఇండ్ బ్యాంక్ సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles