భారత్ లో 2జీ డేటా సేవల కోసం మొబైల్ కస్టమర్లు వెచ్చిస్తుణ మొత్తానికే 4జీ సేవలను అందించడమే లక్ష్యంగా డిసెంబర్ నాటికి రిలయన్స్ జియో సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతన ముఖేష్ అంబానీ వెల్లడించారు. అందరికీ అందుబాటు ధరలో రూపాయలు 4 వేలకే 4జీ ఫోన్లను పరిచమం చేయనున్నామని తెలిపారు. తోలిదశలో 80 శాతం భారతవని 4జీ గోడుగు కిందకు వస్తుందని, వచ్చే మూడేళ్లలో 100 శాతం కవరేజ్ సాధిస్తామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం 2.5 లక్ష్ల కిలోమీటరల్ ఫైబర్ ఆప్టిక్ లైన్లను నిర్మంచామని డీఫ్ ఫైబర్ నెట్ వర్క్ దిశగా మరో రెండేళ్లలో మరిన్ని లైన్లు వేయనున్నామని స్పష్టం చేశారు.
ఇండియాలోని 50 నగరాలలో 10 లక్షల గృహాలకు ప్రత్యక్ష ఫైబర్ కనెక్టివిటీ ివ్వనున్నామని తెలిపారు. 18 వేల గ్రామాలు, టియర్ 2, 3 పట్టణాలకు 4జీ సేవలను అందిస్తామన్నారు. ఈ ప్రాంతాలలోని అన్ని పాఠశఆలలకూ కనెక్టివిటీ ఇస్తామని ముఖేష్ అంబానీ పేర్కోన్నారు. రిలయన్స్ జియో నుంచి జియో గాట్ పేరిట మైబైల్స్ యాప్ ను విడుదల చేయగా, ఏ విధమైన ప్రచారం చేయకుండానే 10 లక్షల మంది డౌట్ లోడ్ చేసుకుని వాడుకుంటున్నారని తెలిపారు. 2016 డిసెంబర్ నాటికి 5 కోట్ల మందికి సెల్ ఫోన్ వాడకందారులకు 4జీ సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కోన్నారు.
ఇంట్లో కూర్చుని తాజాగా విడుదలైన సినిమాలను స్మార్ట్ ఫోన్లో అత్యంత స్పష్టమైన దృశ్య శ్రవణాలతో తిలకించే రోజు త్వరలోనే రానుందని ఆయన అన్నారు. చిత్ర నిర్మాతలతో చేసుకున్న ఓప్పందాలలో భాగంగా రిలయన్స్ జియో మోబైల్స్ మాధ్యమంగా వివిద బాషల చిత్రాను విడుత చేయనుందని చెప్పారు. అందరికీ అందుబాటో వుండేలా తక్కువ ధరకు ఈ సేవలు అందుతాయన్నారు. 4 జీ సేవలు అందుబాటులోకి వస్తే, డిజిటల్ టెక్నాలజీ రంగం విప్లవాత్మక మార్పుతో అభివృద్ది దిశగా పరుతు పెడుతుందని ముఖేష్ అంబానీ అంచనా వేశారు.
తమ 4జీ సేవలతో సినిమాలైనా, టెలివిజన్ చానళ్లయినా హెచ్ డీ మోడ్ లో ఏ విధమైన అవాంతరాలు లేకుండా చూపిస్తమాని ఆయన భరోసా కల్పించారు. తొలిదశలో 8 బాషలకు చెందిన 17 న్యూస్ చానళ్లు, 14 వినోద చానళ్లు ప్రసారం అవుతాయని, వీటిని తిలకించేందుకు రిలయన్స్ జియో ప్ర్యతేక యాప్అను అభివృద్ది చేసిందని ఆయన తెలిపారు.10 లక్షలకు పైగ ాపాటలు, వేలాదిగా సినిమాలను కస్టమర్ల కోసం స్టోర్ చేసి వుంచుతామని చెప్పారు. ఇవి ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని ముఖేష్ అంబాని తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more