Sensex reaches new heights

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Tracking global rally triggered by ECB stimulus measures, the benchmark BSE Sensex set a new high of 29,408 points and NSE Nifty breached the 8,800-level for the first time.

సరికొత్త శిఖరాలకు చేరుకున్న స్టాక్ మార్కెట్లు

Posted: 01/23/2015 08:35 PM IST
Sensex reaches new heights


అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు ఆర్థిక స్థితి మెరుగుకు చేపడుతున్న చర్యల నేపథ్యంలో దేశీయ సూచీలు వారాంతంలో సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29 వేల 408 పాయింట్ల మార్కు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8వేల 800 మార్కుకు చేరుకుంది. ఆ తరువాత కొంత ఒత్తిడిల మధ్య స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్ 273 పాయింట్ల లాభంతో 29 వేల 278 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ కూడా 74 పాయింట్ల లాభంతో తొలిసారిగా 8 వేల 835 మార్కును వద్ద ముగిసింది.

మదుపుదారులు కొనుగోళ్ల ర్యాలీ కొనసాగడంతో అన్ని సెక్టార్లు లాభాలను ఆర్జించాయి. విద్యుత్ రంగం సూచీలు మినహా అన్ని సూచీలు గత ఎన్నిమిది నెలల గరిష్ట లాభాలను ఆర్జించాయి. దీనికి తోడు త్వరలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో టాటా మోటార్స్ , భారతి ఎయిర్ టెల్, సిప్లా, లార్సెన్ తదితర సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, గెయిల్, బిహెచ్ఇఎల్, ఓఎన్ జీషీ, తదితర సంస్థలు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles