మార్కెట్లో బంగారం ధర ఊరిస్తోంది. మరింత దిగివస్తుందేమో అనుకుంటూ కొనేందుకు ప్రజలు ధైర్యం చేయడం లేదు. తాము కొన్న తరువాత పుత్తడి ధర తగ్గితే తమ చేతిలోని పసిడికి వన్నే తగ్గినట్లే నని బావిస్తూ, డోలాయమానంలో కొట్టమిట్టాడుతున్నారు. గత కొంతకాలంగా బంగారం ధర తగ్గుతూ రావడంతో పుత్తడి కొనేందుకు వినియోగదారులు ఉత్సాహం కనబరుస్తున్నా.. మరింత తగ్గుందేమో నన్న అలోచన కూడా వారిలో కలుగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర మరికాస్త తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీపావళి నాటికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.25 వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి.
ఈసారి దీపావళికి బంగారు అభరణాల అమ్మకం ఊపుమీద జరుగుతుందని వర్తకులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ నిబంధనలతో కొన్ని నెలలుగా భారత్లో బంగారు ఆభరణాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఆభరణాల విపణిలో ధంతేరాస్, దీపావళి పండుగలు కొత్త వెలుగులు జిమ్ముతాయని వ్యాపారులు విశ్వాసంగా ఉన్నారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందస్తుగా కస్టమర్లు బంగారుకడ్డీలను కొని దాచుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో 2014 జూలై 10న 10 గ్రాముల బంగారం ధర రూ.25,800 నమోదైంది. అప్పటి నుంచి క్రమేపీ ధర కిందకు వస్తూనే ఉంది. దీంతో ఆభరణాలకు బదులు పుత్తడి కడ్డీలకు డిమాండ్ పెరిగిందని బులియన్ వర్తకులు అంటున్నారు. జూలై నుంచే ఈ ట్రెండ్ పెరుగుతోందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే కడ్డీల అమ్మకాల్లో వృద్ధి 50 శాతం నమోదైంది. ధర తక్కువ కావడం వల్లే కడ్డీల అమ్మకాలు పెరిగాయి. పెళ్లి సమయానికి కడ్డీలను మార్చుకొని మళ్లీ ఆభరణాలను చేయించుకునే వారు కడ్డీలను కోనుగోలు చేస్తున్నారు. సాధారణ కస్టమర్లు మాత్రం ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ధన్తేరాస్, దీపావళికల్లా ఈ మార్కెట్ పుంజుకుంటుందని వర్తకులు ఆశాభావంగా వున్నారు.
ధన్తేరాస్, దీపావళి రోజుల్లో కొనే బంగారం మరో ఏడాది వచ్చే సరికి రెట్టంపు అవుతుందన్న నమ్మకం వున్న ప్రజలు ఈ రోజుల్లో బంగారం కోనుగోలు చేసుందుకు ఇష్టపడతారు. దీంతో ప్రజల అవసరాలకు అనుగూనంగా విభిన్న డిజైన్ల, మోడళ్లలో ఆభరణాలను సిద్దం చేసే పనిలో వర్తకులున్నారు. గతం కన్నా మెండుగా అమ్మకాలు జరుగుతాయన్న అంచానాలతో ముడి బంగారానికి డిమాండ్ పెరగింది. దీంతో 10 రోజుల్లో బంగారం దర స్వల్పంగా పెరిగింది. అయితే పండుగల సీజన్కు 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.25 వేలకు వచ్చే అవకాశముందని అంచనా.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more