(Image source from: NDA govt to release the budget for economic year 2014-15)
ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం కాగా... అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎన్డీయే ప్రభుత్వం ‘‘కేంద్ర అధికారాన్ని’’ చేజిక్కించుకుంది. దీంతో వీరు ప్రజలకు న్యాయం చేసే దిశగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను, పనులను న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే... 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టాల్సిన కేంద్ర బడ్జెట్ ముద్రణ పనులను కూడా మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా నిర్వహించారు. ఈ బడ్జెట్ ప్రింటింగ్ ఆరంభాన్ని సరికొత్త ఒరవడితో హల్వా ఉత్సవాన్ని నిర్వహించారు.
మంగళవారం ఇక్కడి నార్త్ బ్లాక్ లో ఈ బడ్జెట్ ప్రింటింగ్ ఆరంభానికి సూచనగా నిర్వహించిన ఈ హల్వా ఉత్సవంలో అందులో పాలుపంచుకునే అధికార్లు, ఇతర సిబ్బందులు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ అధికార్లందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ హల్వా ఉత్సవంలో అరుణ్ జైట్లీతోపాటు ఆర్థిక సహాయమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్, సంయుక్త కార్యదర్శి (బడ్జెట్) రజత్ భార్గవ, ఆర్థిక శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికార్లు కూడా పాల్గొన్నారు.
ఇందులో భాగంగానే అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ‘‘భారతదేశంలో వున్న అధిక ద్రవ్యలోటు ఒక సవాలుగా మారింది. పైగా బడ్జెట్ సమర్పణకు కేవలం కొన్నిరోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇటువంటి సమయంలో దేశానికి క్రమశిక్షణ చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో వివేకమైన మార్గాలను అనుసరించాల్సి వుంది’’ అని ఆయన చెప్పారు. అనవసరమైన ప్రజాకర్షక విధానాలను మొగ్గు చూపిస్తే మన ఖజానాకే నష్టం కాబట్టి వివేకంతో ఆర్థిక విషయాల్లో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన వెల్లడించారు.
‘‘దేశ ఆర్థికవృద్ధి 5 శాతం లోపే వుంటే.. ద్రవ్యలోటుతోపాటు ద్రవ్యోల్బణం కూడా అధికంగా పెరిగిపోతుందని... అటువంటి సమయాల్లో ప్రజలకు నచ్చే విధానాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అంటే... దీర్ఘకాలంలో హాని జరిగే దారిలోకి మనం ప్రయాణించినట్లవుతుందని’’ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈయన ప్రసంగాన్ని బట్టి చూస్తుంటే.. వినియోగదార్లు మెరుగైన సేవలను కోరుకునే పక్షంలో దానికి బదులుగా మరింత ఎక్కువగా చల్లించాల్సి వస్తుందన్న ధోరణిలో మంత్రిగారు హెచ్చరిస్తున్నట్టు కనిపిస్తోందని కొంతమంది అధికార్లు తెలుపుతున్నారు. జూలై 10వ తేదీన ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎన్టీయే ప్రభుత్వానికి మొదటిది కావడం విశేషం! ఏదేమైనా... ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా బడ్జెట్ నిర్ణయిస్తారని ఆశిద్దాం!
AS
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more