ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనం మంగళవారం అధికారికంగా పూర్తయ్యింది. ఇకపై ఈ సంస్థ టెక్ మహీంద్రా పేరుతో కొనసాగుతుంది. దీంతో.. ఐటీ రంగంలో రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన సత్యం కంప్యూటర్స్(మహీంద్రా సత్యం) పేరు పూర్తిగా కనుమరుగైంది. తాజా పరిణామంతో టెక్ మహీంద్రా 2.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో .. దేశీయంగా అయిదో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థగా ఆవిర్భవించింది. ఆనంద్ మహీంద్రా దీనికి చైర్మన్గాను, వినీత్ నయ్యర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా, సీఎఫ్వోగా మిలింద్ కులకర్ణి ఉంటారు. టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనాన్ని రెండు సంస్థల బోర్డులు గతేడాది మార్చి 21న ఆమోదించగా, ఈ నెల 11న రాష్ట్ర హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. విలీనానికి మార్గం సుగమమైంది. సంయుక్తంగా అతి పెద్ద ఐటీ కంపెనీగా ఎదుగుతామంటూ, 2009లో సత్యం కొనుగోలు సమయంలో మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్లో మరింత వేగంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
గత నాలుగేళ్లుగా తాము చట్టపరంగా అనేక సవాళ్లు అధిగమించామని, ఉత్తమ విధానాలను పాటించడం ద్వారా షేర్హోల్డర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశామని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. కంపెనీపై విచారణలేమీ పెండింగ్లో లేవని నయ్యర్ చెప్పారు. రామలింగరాజు హయాంలో కుంభకోణానికి సంబంధించిన విచారణ విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. కంపెనీకి కొత్త లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం టాప్ ఫోర్ దేశీ ఐటీ కంపెనీలుగా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more