Business news

16.1.png

Posted: 09/24/2012 10:57 PM IST
Business news

సంస్కరణలతో కదంతొక్కుతున్న యూపీఏ ప్రభుత్వం ఈ జోరును మరింత పెంచేలా కనిపిస్తోంది. ఇప్పటికే మల్టీబ్రాండ్ రిటైల్, విమానయానం, బ్రాడ్‌కాస్టింగ్ తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విషయంలో కీలక నిర్ణయాలను ప్రకటించిన కేంద్రం... రానున్న రోజుల్లో మరిన్ని చర్యలకు రెడీ అవుతోంది. వచ్చే వారంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకోవచ్చని స్టాక్ మార్కెట్లో అంచనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి పెంపు, భారీ నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కమ్)ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ, రేషన్ షాపుల ద్వారా విక్రయించే చక్కెర ధర పెంపు వంటివాటిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బీమా, విద్యుత్, ఇన్‌ఫ్రా ఫైనాన్స్, బ్యాంకింగ్, చక్కెర స్టాక్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. సంస్కరణలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్‌కు ఈ నిర్ణయాలు మరింత జోష్‌నివ్వవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No fees online currency transfers
Uninor rolls out sabse sasta talk plans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles