నైనితాల్.. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే అద్భుతమైన ప్రదేశం. హిమాలయ శ్రేణులలో ‘కుమావొన్ హిల్స్’ మధ్య భాగంలో వున్న ఈ ప్రాంతం అందమైన సరస్సులను కలిగి వుంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం.. తాల్ అంటే సరసు. భారతదేశంలో నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాకుండా పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. నైనీతాల్ కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వతశిఖరాల మద్యనున్న ప్రదేశంలో ఉపస్థితమై ఉంది. ఈ ప్రాంతానికి ‘నైనితాల్’ అనే పేరు రావడం వెనుక వున్న చరిత్ర ‘స్కందపురాణం’లో పొందుపరచబడింది.
పేరువెనుక చరిత్ర :
‘స్కందపురాణం’లోని మానస ఖండ్ లో నైనితాల్ ను ‘ముగ్గురు ఋషుల సరస్సు’ లేదా ‘ముగ్గురు ఋషుల సరోవరం’ అని అంటారు. ఆ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, పులాహ. వీరు ముగ్గురు తమ దాహం తీర్చుకునేతందుకు నైనితాల్ వద్ద ఆగారు. ఈ ప్రాంతంలో నీరుకోసం ఎంత వెదికినప్పటికీ వారికి దొరకలేదు. దీంతో వారు ముగ్గురు కలిసిన వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వడం ప్రారంభించారు. దానిలోకి ‘మానస సరోవరం’ నీటిని నింపి వారు తమ దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనితాల్ సరస్సు సృష్టించబడింది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి ఎడమ కన్ను పడి.. ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.
మరికొన్ని ఆసక్తికర విశేషాలు :
- భూతల స్వర్గంలా తలపించే ఈ నైనితాల్ ఎంతో ఆకర్షణీయంగా వుండటంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని కలిగివుంటుంది. బ్రిటిష్ వ్యాపారి అయిన ఫై.బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తరువాత ఈ ప్రాంతం కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అయినప్పటికీ 1841 తరువాతనే నైనీతాల్ అభివృద్ధిచేయబడింది.
- 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ ఆర్టిల్లరీ నైనీతాల్ను దర్శించాడు. ఆయన మాటలలో ‘దాదాపు సముద్రమట్టానికి 7,500 అడుగులు (2,300 మీటర్లు) ఎత్తువరకు నివాసగృహాలు వ్యాపించి ఉన్నాయి’ అని వర్ణించాడు. తరువాత కాలంలో అటవీప్రాంతంలో సెయింట్ జాన్ చర్చ్ నిర్మాణం జరిగింది.
- నైనిటాల్ సందర్శనకు ప్రణాళిక చేసే వారు ఇక్కడే కల హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాల్సిందే! దీంతోపాటు ఇండియాలోని 51 శక్తి పీఠాలలో ఒకటైన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి.
- షాజాన్పూరుకు చెందిన చక్కెర వ్యాపారి పి.బారన్ యురేపియన్ హౌస్ (భక్తుల వసతి గృహం) నిర్మాణంతో ఇక్కడ మొదటి నిర్మాణం ఆరంభం అయింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more