ఆధునికత పేరుతో , ప్రతీ రోజు మన జీవన శైలి దగ్గరనుండి వేషధారణ వరకు , ఎన్నో మార్పులు చేసుకుంటున్నాం . మంచిదే ... అయితే ఈ క్రమం లో మన ఉనికిని చాటే కుంకుమని మాత్రం పూర్తీ గా మర్చిపోయాం ... సాంప్రదాయంగా తయారయ్యే వారిని, ముద్దుగా 'ఆంటీ' అని కూడా పిలుస్తున్నాం.
అసలు కుంకుమ కి ఉన్న ప్రాధాన్యం ఏంటి ? ఏ విధంగా ఇది మన ఉనికిని చాటుతుంది ??? కుంకుమ బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖాన సిందూరం ఉంటే దృష్టి సోకదని, రోజంతా సాఫీగా సాగిపోతుందని చెప్తారు. నుదుట తిలకం లేకపోతే ముఖం కళ తప్పి బోసిగా ఉండటమే కాదు, మంచిది కాదని పండితులు ఉద్బోధించారు. కనుక కుంకుమ కేవలం సౌందర్య చిహ్నం కాదని, నర దృషి సోకకుండా ఉంటుందని అంటారు.
కుంకుమ లేదా తిలకం ఎర్రగా ఉంటుంది. ఎరుపు సూర్యునికి సంకేతం. నుదుట ధరించే సిందూరం సూర్యుని వేడిమి తాకకుండా చేస్తుంది. ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే, శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై, ఎప్పుడూ చైతన్యంగా
ఉండే అతి కీలకమైన "సుషుమ్న" నాడి ఉండేది లలాటం మీదనే. దాన్నే "జ్ఞాననేత్రం" అంటారు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా చేసేందుకు సిందూరం పెట్టుకునే ఆచారం జనించింది. అంటే రక్త ప్రసరణ వల్ల, ఆలోచనల వెల్లువ వల్ల కలిగే వేడి జ్ఞాననేత్రానికి తగలకుండా అది సురక్షితంగా ఉండేందుకు గానూ ఎప్పుడూ కుంకుమ ధరించి ఉండాలి అన్నారు.
స్త్రీలే ఎందుకు సిందూరం ధరించాలి అనే సందేహం కలగడం సహజం. ఆది నుండి ఇప్పటివరకూ పురుషుల ఆధిక్యతే నడుస్తోంది కదా! కనుక ఏ రకంగా నైనా స్త్రీలే ఎక్కువగా వత్తిడికి గురౌతారు. పురుషుల కళ్ళే స్త్రీలమీద పడతాయి, పురుషులే స్త్రీలను లోబరచుకోవాలని చూస్తారు. కనుక మగవారి దృష్టి పడకుండా, ఏ రకమైన వత్తిడికి గురవకుండా ఉండేందుకు మహిళలు నుదుట కుంకుమ ధరిస్తారు.
ముఖాన సిందూరం లేకపోతే అశుభం అని, నుదుట కుంకుమ ధరించిన స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు లాంటి శుభకార్యాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానించడం ఆచారంగా, ఆనవాయితీగా వస్తోంది. ఏ శుభ కార్యానికైనా సిందూరం నాంది. కుంకుమతో ఆహ్వానించడాన్ని శుభ సూచకంగా భావిస్తారు. ఇంట్లో ఏ శుభం జరిగినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తీర్చిదిద్దుతారు. పెళ్ళిళ్ళు తదితర శుభ లేఖలకు పసుపు కుంకుమలు అద్దుతారు.
ఖరీదైన దుస్తులు లేకపోవచ్చు.. కానీ చిటికెడు కుంకుమ లేని ఇళ్ళు ఉండవు. ఆ కుంకుమే అమూల్యమైంది. అపూర్వ కళను తెచ్చిపెడుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more