India Classified as 'Flawed Democracy' ధేశపౌరులకు ప్రజాస్వామ్య స్వేచ్ఛ తగ్గిందా.?

India classified as flawed democracy backsliding by authorities

India, economist intelligence unit, EIU, democracy index, democracy in India, EIU global Ranking, Flawed Democracy, Narendra Modi, Thailand, America, France, Belgium, Brazil, International politics

India slipped two places to 53rd position in the 2020 Democracy Index’s global ranking, according to The Economist Intelligence Unit, which said the “democratic backsliding” by authorities and “crackdowns” on civil liberties has led to a further decline in the country’s ranking.

ధేశపౌరులకు ప్రజాస్వామ్య స్వేచ్ఛ తగ్గిందా.?

Posted: 02/05/2021 10:19 PM IST
India classified as flawed democracy backsliding by authorities

పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి ప్రస్తావించారు. అయితే తాజాగా వచ్చిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రకటించిన ప్రజాస్వామ్య సూచీలో భారత ర్యాంకు దిగిపోవడానికి సంకేతమేమిటో కూడా అమె పార్లమెంటులో చెబుతారా.. లేక మీడియా ముఖంగా దేశ ప్రజలకు చెబుతారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

భారత్ దేశంలో ఎన్డీయే ప్రభుత్వం దేశ పౌరుల కోసం అనేక సరికొత్త విధానాలను అవలంభిస్తూ అనేక మార్పులు తీసుకువచ్చిందని నిత్యం గోప్పలు చెప్పే కేంద్రమంత్రులు, బీజేపి సహా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా బాసిల్లుతున్న భారత్ లో ప్రజాస్వామ్య సూచీ ఎందుకు తగ్గిందో చెప్పగలరా.? గడచిన 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు సాధించామని బీరాలు పోతున్న నేతలు.. క్రమక్రమంగా దేశంలో దేశపౌరులకు ప్రజాస్వామ్యం కల్పించిన స్వేచ్ఛ కూడా హరించుకుపోతున్నదన్న విషయం అసలు తెలుసా.?

అధికారంలో వుంటూ అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్న అధికార పక్షం నేతలకు.. గ్రామీణ ప్రజల నుంచి నానాటికీ హరించుకుపోతున్న స్వేఛ్ఛా స్వతంత్రాల గురించి..ఏం తెలుస్తుందన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. 2014లో 7.92 పాయింట్ల స్కోరుతో ప్రపంచంలోనే 27వ స్థానంలో ఉన్న భారత్ కేవలం ఏడేళ్ల కాలంలో ఎందుకు 53వ స్థానానికి దిగజారిందన్న వివరణను బీజేపి పెద్దలు కానీ.. కేంద్రప్రభుత్వ అధికారులు కానీ.. కనీసం కేంద్రమంత్రులైనా వివరించగలరా.? అసలు ఈ అంశంపైన వారు అసలు దృష్టి సారించారా.?.

ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో తొలిసారిగా అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ శిరస్పు నేలకు తాకించి మరీ మొక్కారు. అయితే అదే దేవాలయంలో కోలువైన దేవుడు దేశవ్యాప్తంగా ప్రజలల్లో వుంటాడన్న విషయం కూడా ఆయనకు తెలియంది కాదు. ప్రజల సుఖసంతోషాల్లో.. ప్రజాస్వామ్య దేవాలయానికి కొత్త వెలుగులు వస్తాయని, అదే వారు కష్టనష్టాల్లో ఉంటే అందుకు వ్యతిరేక ఫలితాలు వుంటాయన్న విషయం కూడా తెలుసు. అన్ని తెలిసిన పెద్దలు ఇప్పటికే దిగజారిన ప్రజాస్వామ్య సూచిని ఇకనైనా మెరుగుపరుస్తారో.? లేదో వేచిచూడాల్సిందే.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : EIU  democracy index  India  global Ranking  Flawed Democracy  Narendra Modi  International politics  

Other Articles