Farmers protest: "Attacks" By Government, Allege Farmers రైతులపై ఢిల్లీలో బీజేపి బడాయి.. శివార్లలో లడాయి..

Farmers protest nails on roads no internet attacks by government allege farmers

farmers protest, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, Intelligence bureau, farmers turn violent, farmers rally deviated, farmers ram leela maidan, supreme court committee, delhi, politics

Multiple barricades, barbed wire fences, digging of trenches, nails on roads, Internet suspension have been put up at the protest sites near Delhi's borders with Haryana and Uttar Pradesh as farmers continue their sit-in against the three contentious agricultural laws. "Attacks" being organised by the government, the Samyukt Kisan Morcha, an umbrella body of farmer groups, has said.

రైతులపై ఢిల్లీలో బడాయి.. శివార్లలో లడాయి..

Posted: 02/02/2021 09:27 PM IST
Farmers protest nails on roads no internet attacks by government allege farmers

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని.. వారి అభ్యున్నతి కోసమే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకువచ్చిందని చెబుతున్నా.. వారితో కేంద్రం పలు పర్యాయాలు చర్చలు నిర్వహించినా.. ఫలితం మాత్రం శూన్యం. వన్నులో చలి పుట్టే శీతలకాలంలోనూ.. ఏ డిమాండ్ తో నిరసన బాట పట్టారో రమారమి మూడు నెలలు కావాస్తున్న ఆ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.

కేంద్రం తన తాజా బడ్జెట్ లోనూ అటు వరి, ఇటు గోధుమ పంటలకు మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించిన కేంద్రానికి రైతుల సంక్షేమంపై నిజంగా చిత్తశుధ్ది వుంటే.. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు తమ ఉనికికి, మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుందన్న అనుమానాలతో నిరసనోద్యమం చేపట్టిన రైతన్నల డిమాండ్ మేరకు బిల్లును ఉపసంహరణపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చుకదా.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు తమ పని కాదంటున్న రైతుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అది వారి పనే అని హైలెట్ చేయడం కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యేట్టు చేస్తోంది.

ఇక ఇప్పటికే ఏకంగా 200 మందిపై కేసులు బనాయించినా.. వేలాదిగా దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలకు చేరుకుని నిరసన చేపడుతున్న రైతులు మాత్రం తమ నిరనస పంథాను మాత్రం వీడటం లేదు. సాగు చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గే వరకు తమ నిరసన నిలిచిపోదని ఖరాఖండీగా చెబుతున్నారు రైతులు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంలో రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రధానిపై రైతులు సందేహాన్ని వ్యక్తం చేయడం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించారు. అయితే రైతులు ఏమి అలోచించినా.. ప్రధాని మాత్రం వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కాంక్షతోనే వున్నారని కేంద్రమంత్రి పేర్కోన్నారు.  

ఇదిలావుండగా.. యావత్ దేశం చూస్తుండగా తమపై బడాయిలను బాగా చెబుతూనే.. తీరా తాము నిరసనోద్యమం చేస్తున్న ప్రాంతంలో మాత్రం లడాయికి కేంద్రం సిద్దమైందని రైతులు అరోపిస్తున్నారు. దేశ ప్రజల దృష్టిలో తమపై ప్రేమను కనబరుస్తున్న కేంద్రం.. నిజానికి తమపై మాత్రం ఉక్కుసైన్యాన్ని వినియోగిస్తూ చెదరగోట్టేందుకు అనేక విధాల ప్రయత్నాలు కొనసాగిస్తోందని అన్నారు. స్థానికులను కూడా తమపైకి ఉసిగోల్పుతున్న చర్యలు కేంద్రానివేనని పలువరు రైతులు అరోపిస్తున్నారు. తాము సాగు చేయకపోతే.. పంటలు పండించకపోతే తమ గూడారాలను పీకేస్తున్న వారు ఏం తింటారని వారు ప్రశ్నిస్తున్నారు.  

ఇక తాజాగా తాము ఈ నెల 6న జాతీయ, రాష్ట్రీయ రహదారులపై మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రాస్తో రోకో చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తమ ఉద్యమానికి తరలివస్తున్న రైతులను అడ్డుకునేందుకు కేంద్రం.. దారిలో సిమెంటు కాంక్రీట్ వేసి వాటిలో నిటారుగా మెకులను ఏర్పాటు చేశారని దీంతో వీటిపై నుంచి ఏలాంటి వాహనాలు వెళ్లకుండా వెళ్లినా పంక్చర్ అయ్యేలా చర్యలు చేపట్టడం.. దీనికి తోడు మార్గమధ్యంలోని పలు చోట్ల పలు చోట్లు రోడ్డుకు అడ్డంగా ఇనువ చువ్వలతో కూడిన గోడలను నిర్మించడాన్ని రైతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

తాము అత్యల్ప ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని ఇక్కడే తిష్టవేసి కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తరుణంలో కేంద్రం ఢిల్లీ పోలీసులకు ఉక్కుతో కూడిన లాఠీలను ఇచ్చిందని, దీంతో వారు తమపై అకారణంగా కూడా విరుచుకుపడే అవకాశాలు వున్నాయని, అలాంటి పరిస్థితులను వారే సృష్టించి కూడా ఉక్కులాఠీలకు పని చేప్పే అవకాశాలు వున్నాయని అరోపిస్తున్నారు, ఇలా కేంద్రం తమపై యుద్దానికి సన్నధమైందని తమకు మద్దతు లభించకుండా, నిరసన తెలిపే ప్రాంతాల్లో కనీస అవసరాలు కల్పించకుండా తమను శిభిరాలు వదిలి వెళ్లేలా చేస్తుందని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles