ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మృతిపై ప్రపంచదేశాల మీడియాకు అనుమానాలు వీడటం లేదు. పలు దేశాల మీడియా ఆయన అరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణించాడంటూ ఓ వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కోట్టింది. అయితే వీటిని తీవ్రంగా ఖండించిన ఉత్తర కొరియా ఆయన ప్రజల ముందుకు వచ్చిన ఫోటోలను, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అయినా కిమ్ పై పలు దేశాల మీడియాకు నెలకొన్న అనుమానాల్లో కించింత్ ప్రభావాన్ని కూడా చూపలేకపోతున్నాయి.
ప్రజల మద్యలోకి వచ్చినా.. మూడు వారాలుగా వస్తున్న వార్తలకు తెరపడుతుందని బావించగా.. అందుకు విరుద్దంగానే ప్రచారం జరుగుతోంది. కిమ్ ఏప్రిల్ 11 నుంచి అధికారిక కార్యక్రమాల్లో కనిపించకపోయే సరికి ఆయన ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. కోమాలోకి వెళ్లిపోయాడని అందువల్లే ఏప్రిల్ 15న కిమ్ తన తాత 108వ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ తెరదించుతూ కిమ్ ప్రజల ముందుకు వచ్చినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఇదే అసలు అనుమానాలకు కారణమవుతోంది.
అదెలా అంటే.. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్ చాన్ ప్రాంతంలో ఓ ఎరువుల కంపెనీ ప్రారంభోత్సవ వేడక కార్యక్రమానికి కిమ్ హాజరైనట్లు కేసీఎన్ఏ తెలిపింది. ఈ వేడుకలకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా హాజరైనట్లు పేర్కొంది. ఇంతవరకు బాగానే వున్నా.. ఈ కార్యక్రమానికి ఉత్తర కొరియా అధికారిక మీడియా మినహాయించి ఇతర పాత్రికేయులు హాజరయ్యేందుకు అనుమతిని ఇవ్వలేదు. దీంతో కేసీఎన్ఏ ప్రచురించిన కథనాన్ని, విడుదల చేసిన ఫొటోలను అంతర్జాతీయ మీడియా సంస్థలు ధ్రువీకరించలేకపోయాయి.
దీంతో కిమ్ ఆరోగ్యంపై విభిన్న వార్తలు వస్తునే వున్నాయి. దీంతో ప్రజల ముందుకువచ్చిన తరువాత కూడా కిమ్ అరోగ్యం విషయంపై ఇంకా అనుమానాలు వెన్నాడుతూనే వున్నాయి. ఇక ఈ విషయాన్ని అటుంచితే.. కిమ్ అరోగ్యం నేపథ్యంలో చైనా కూడా ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఉత్తరకొరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న అగ్రరాజ్యం అమెరికా కూడా ఓ కన్నువేసింది. కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Sep 04 | మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నాయుడుకు మరో పదవి దక్కనుందా.? అంటే అవుననే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీలో జోరుగా వినబడుతున్నాయి, అచ్చన్నాయుడికి రాష్ట్ర... Read more
Sep 04 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆఘమేఘాల మీద మద్యం రేట్లను తగ్గిస్తూ, పెంచుతూ సవరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏవైనా.. వాటితో పాటు తెరవెనుక మరో... Read more
Sep 04 | మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం సహా పలువురి నుంచి ప్రశ్నల లేవనెత్తడంతో ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా.. వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శల నేపథ్యంలో తన పీఎం కేర్స్... Read more
Jun 13 | మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకుడు పత్తిపాటి పుల్లారావు త్వరలో టీడీపీ పార్టీకి షాకివ్వనున్నారా.? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలానే కనబడుతున్నాయి. గుంటూరు జిల్లా నుంచి టీడీపీకి పార్టీ తరపున మూడు పర్యాయాలు... Read more
Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more