భారత అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తన శాయశక్తులా కృషి చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేతికి మరో కీలకమైన పదవి అందబోతుందా..? అయన మరోమారు సెంట్రల్ బ్యాంకు బాధ్యతలు చేపట్టే అవకాశాలు వున్నాయా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అవునండీ అయితే అది మాత్రం మన దేశంలోనే లేక అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కాదట.
అర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ పదవి పోడగింపు విషయంలో ప్రధానికి కీలక విషయాల్లో మౌత్ పీస్ గా మారారని విమర్శలు ఎదుర్కోన్న బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన రాద్దాంతం.. ఆ పిమ్మట కేంద్రం చేసిన తాత్సరంతో తాను ఇక అర్బీఐ గవర్నర్ గా కొనసాగనని తనకుతానుగా వెల్లడించి వెళ్లిపోయిన రాజన్.. ఏకంగా బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్' గవర్నర్ రేసులో వున్నారని సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి గవర్నర్ కోసం యూకే ప్రభుత్వం కొందరు ప్రముఖ ఆర్థికవేత్తల పేర్లను పరిశీలిస్తోంది.
యూకే ట్రెజరీ ఛాన్సెలర్ ఫిలిప్ హామండ్ ఇప్పటికే గవర్నర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్టు సమాచారం. రేసులో మొత్తం ఆరుగురు ఉన్నారని... వీరిలో రాజన్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ బాధ్యతలను స్వీకరించారు. 2014లో ఐఎంఎఫ్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ, తిరస్కరించారు. ఆర్బీఐ గవర్నర్ గా 2016లో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నాక... అమెరికాలోని ఓ యూనివర్శిటీలో ఆయన ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more