Is BJP 0% interest loan a technical error questions opposition గుజరాత్ ఎన్నికల ప్రకటనకు ఎర్రర్ ఇదేనా.?

Oppostions question cec is bjp 0 interest loan announcement a technical error

farmers interest free loans, gujarat gourav yatra, farmers loans at zero interest, Vijay Rupani announces farmers loans, Vijay Rupani, Gujarat, gujarat farm loans, gandhinagar, BJP, Amit Shah, PM Modi, Technical error, CEC, central election commission, politics, congress

After Gujarat Chief Minister Vijay Rupani announment of crop lending-loan at zero percent interest a technical error to the shedule of gujarat elections questions opposition parties

గుజరాత్ ఎన్నికల ప్రకటనకు ఎర్రర్ ఇదేనా.?

Posted: 10/17/2017 05:18 PM IST
Oppostions question cec is bjp 0 interest loan announcement a technical error

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆరు మాసాలు గడిచిన ఇంకా అనేక ఏటీయం కేంద్రాలలో.. కరెన్సీ అందుబాటులో లేదేమని ప్రశ్నించిన మీడియాకు అప్పట్లో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన సమాధానం టెక్నికల్ ఎర్రర్. అంటే సాంకేతిక సమస్య ఉత్పన్నమైందని. కానీ అది ఎంత వరకు వాస్తవం కాదన్న విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమీషన్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నిల విషయంతో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయకున్నా.. ఎన్నికలు మాత్రం డిసెంబర్ 18 లోపుగానే నిర్వహిస్తామని మాత్రమే చెప్పాయి.

కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నగరా మ్రోగించాల్సిన సమయం అనస్నమైనా ఇంకా నాన్చివేత ధోరణిని ఎందుకు అవలంభిస్తున్నారన్న ప్రశ్నకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా అదే సమాధానం ఇచ్చారు. అదే టెక్నికల్ ఎర్రర్. సాంకేతిక పరమైన సమస్య ఉత్పన్నమైందని. అయితే అ సాంకేతిక సమస్య ఏంటిన అప్పటల్లో విపక్షాలు నిలదీశాయి. సమాధానం దాటవేసిన అధికారులు అప్పట్లో మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం గుజరాత్ రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలకు అ టెక్నికల్ ఎర్రర్ ఏంటో మాత్రం అర్థమైంది.

ఆ టెక్నికల్ ఎర్రర్ మరేదో కాదు.. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నిర్వహిస్తున్న గుజరాత్ గౌరవ్ యాత్ర అన్నది అందరికీ తెలిసిపోయిందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేవలం గుజారాత్ సీఎం విజయ్ రూపానీ తలపెట్టిన పక్షం రోజుల రాష్ట్ర యాత్ర ముగించాలన్న ఉద్దేశ్యం.. ఈ యాత్ర ముగింపు సభలో అయన రైతులపై వరాల జల్లు కురిపించేందుకేనన్న విషయం ప్రజలకు అవగతమైంది. నిన్న ముగిసిన రూపానీ యాత్ర నేపథ్యంలో ఆయన రైతులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా రైతులకు రూ. 3 లక్షల రుణం ఎలాంటి వడ్డీ లేకుండా అందించేందుకు సిద్దమని ప్రకటించారు.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ప్రకటన చేసేందుకనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చి.. గుజరాత్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయనీయకుండా అడ్డుకుందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ మేరకు అనేక విమర్శలు గుప్పించినా.. కేవలం ఎన్నికల సమయంలో కొంత టెక్నికల్ ఎర్రర్ వుందన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన సీఈసీ.. ప్రశ్నలను పక్కదారి పట్టించిందన్న విమర్శలున్నాయి. ఇక సీఎం ప్రకటన వచ్చిన తరుణంలో ఇక అలస్యం చేయకుండా సీఈసీ గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తుందన్న వ్యంగస్త్రాలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles