ఆంధ్రా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? బీజేపీతో చేతులు కలిపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అయ్యారా? అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు ఆర్ణబ్ గోస్వామికి చెందిన ‘రిపబ్లిక్ టీవీ’ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అంత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అంటూ అర్ణబ్ ఛానెల్ జగన్ బీజేపీతో చేతులు కలపడానికి సర్వం సిద్ధమైందని పేర్కొంది.
ఇందుకోసం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించిందని తెలిపింది. జగన్ను ఆయన బీజేపీలోని ముగ్గురు ముఖ్యనాయకుల వద్దకు తీసుకెళ్లి చర్చలు జరిపారని వివరించింది. ఎన్డీయేలో చేరికకు జగన్ తన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేశారని చానల్ పేర్కొంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జగన్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, ప్రత్యేక హోదాపై కిమ్మనకుండా ఉండడం, ఇవన్నీ అందులో భాగమేనని ‘రిపబ్లిక్ టీవీ’ తన కథనంలో పేర్కొంది.
వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్లాలనేది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని బీజేపీ కూడా చెబుతోంది. జగన్పై ఉన్న అవినీతి ఆరోపణలను తేలిగ్గా తీసుకున్న ఓ బీజేపీ నేత మాట్లాడుతూ ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే వారితోనే ఏపీలో కలిసి వెళ్తామని చెప్పడం ఈ వార్తకు మరింత ఊతమిస్తోంది. తమది పక్కా రాజకీయ పార్టీ అని, చంద్రబాబుతో లాభం ఉందనుకుంటే ఆయనతో కలిసి వెళ్తామని, లేదంటే మరో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
బీజేపీలో జగన్ చేరికకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ కథనం వెలువడినట్టు చెప్పుకుంటున్నారు కూడా. బీజేపీ కరడు గట్టిన మద్ధతు దారుడు అర్నబ్ ఛానెల్ నుంచే ఇలాంటి వార్త వెలువడటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more