టీడీపీ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఎన్నికకు సొంత నేత కాటం వద్దంటున్నా వైసీపీ అధినేత జగన్ పోటీకి సిద్ధమయ్యాడు. రాజకీయ చతురతను ఉపయోగించి అసంతృప్తిలో ఉన్న శిల్ప బ్రదర్స్ ను సక్సెస్ ఫుల్ గా లాగేశాడు. అదే సమయంలో ప్రజల్లో క్రేజ్ ఉన్న జనసేన అధినేత పవన కళ్యాణ్ మద్ధతు కీలకంగా మారింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరుగుతున్నందున రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించాడు.
2019 ఎన్నికల ముందు వస్తున్న ఈ ఎన్నికలో గెలుపు ఇటు టీడీపీకి, అటూ వైకాపాకు రెండు పార్టీలకూ కీలకమే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పవన్ నంద్యాల ఎన్నికలపై స్పందించడం ఇరు పార్టీల్లోనే కాక, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కులం ఆధారంగా ఓటు బ్యాంక్ ఇక్కడ కీలకం కానుంది. నియోజకవర్గంలో బలిజలు, ముస్లింలు, ఆర్య వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 42వేల మంది బలిజ(కాపు) ఓటర్లే ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎవరికైనా మద్దతు ప్రకటిస్తే, ఈ సామాజికవర్గంపై ఓట్లు తీవ్ర ప్రభావం చూపే ఆస్కారం ఉంది.
ఇక మరో 25 వేల నుంచి 35 వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు (కులాలకు సంబంధం లేకుండా), సేవాదళ్ సాధారణ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ ఆశయ సాధన సమితి సభ్యులు ఉన్నారు . వీరు పవన్ ఏది చెబితే దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ మద్ధతు కీలకం కానుంది. టీడీపీకే మద్ధతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావింస్తుండగా, మరోవైపు నాగిరెడ్డి తనయ, మంత్రి భూమా అఖిలప్రియ పవన్ కల్యాణ్ తో పీఆర్పీ ఉన్న సమయం నుంచే తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పటంతో మద్ధతు ఇచ్చే విషయంలో సానుకూలతతోనే ఉన్నాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే టీడీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ, నంద్యాల ఎన్నికకు పవన్ దూరంగా ఉండటం (తటస్థం) ఉంటేనే మంచిదని విశ్లేషకులు చూసిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేసే వలలో పవన్ పడతాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more