ఏపీ రాజకీయాల్లో తన మార్క్ ను చూపించేందుకు రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ త్వరలో ఇక్కడ అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల పర్యవేక్షణ చేయబోతున్నాడు కూడా. ఈ క్రమంలో టీడీపీ వ్యతిరేక పార్టీలన్నింటిని కూడగలిపి ముందుకు సాగాలంటూ ప్రశాంత్ జగన్ కు ఓ సలహా ఇచ్చాడనే వార్త గత కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తోంది. 2019లో అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా పవన్, కాంగ్రెస్ లాంటి పార్టీలతో చేతులు కలపాల్సిందేనని చెప్పాడంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే అంతా బాగానే వాటిని ప్రసారం చేసిన మీడియాపైనే ఇప్పుడు అసలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు ఈ వార్తలు మొదలయ్యింది మొదట ఆంధ్రజ్యోతిలోనే. వేమూరి రాధాకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబుకి ఉన్న సాన్నిహిత్యం తెలిసిన వారెవరైనా కథనం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. బాబును ఓడించే విధానంపై అంత విశ్లేషణ చేసి మరీ ఎందుకు ప్రసారం చేశాడు? వాళ్ల మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అన్న అనుమానాలు కలిగాయి. కానీ, నిశితంగా ఆ కథనాలు పరిశీలిస్తే దాని వెనుక ఉన్న మైండ్ గేమ్ అర్థం చేసుకోవటం చాలా సులువనే పలువురు చెబుతున్నారు.
ఒకటి బీజేపీపై ఎంత వ్యతిరేకతతో ఉన్నప్పటికీ పవన్ టీడీపీకి ఎందుకు వ్యతిరేకంగా వెళ్తాడు అన్న ప్రశ్న తో ఇది మొదలౌతుంది. ఒకవేళ అలాగే వెళ్లిన అధికార పక్షం ఓట్లను టార్గెట్ చేస్తాడే తప్ప.. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మీద ఎందుకు కాంసంట్రేషన్ చేస్తాడన్నది ఒకటి. ఇక పవన్ తో దోస్తీకి జగన్ ముందుకు వస్తే అది ఒకరకంగా తనకే దెబ్బగా మారే అవకాశం ఉంది. పొత్తు మూలంగా వైసీపీ చాలా వీక్ గా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. ఇలాంటి టైంలో జగన్ అలాంటి డెసిషన్ తీసుకోడనే పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు సపోర్ట్ ఇస్తామనే ప్రకటన ద్వారా బీజేపీకి క్లోజ్ అయ్యే పనిలో జగన్ ఉన్నాడు. ఇలాంటి టైంలో పవన్ పై కాక మీద ఉన్న బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి మరీ జగన్ చేతులు కలుపుతాడనే హింట్ ఆటోమేటిక్ గా చిచ్చు పెడుతుంది. ఆ లెక్కన పవన్-జగన్ దోస్తీ అన్నది ఓ ఊహాత్మక కథనంగా భావించొచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more