తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన వ్యక్తి త్వరలో భారత ఉప రాష్ట్రపతి పదవికి అధికార బీజేపి పార్టీ తరపున బరిలో నిలవనున్నారా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. ఇంతకీ ఎవరాయన..? అంటారా.. అయన మరెవరో కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా అత్యంత సునాయాసంగా పరిష్కరించి.. గవర్నర్ పదవికి వన్నె తెచ్చిన మన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. ఏంటీ నమ్మశక్యంగా లేదా..? అయితే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం ఇదే తప్పక జరగొచ్చు అంటున్నాయని విశ్వసనీయ వర్గాలు.
ఉపరాష్ట్రపతి పదవికి గవర్నర్ నరసింహన్ పేరు పరిశీలనలో వున్నట్లు ఢిల్లీ వర్గాల్లు కూడా అనధికారికంగా ఉప్పందిస్తున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తన రెండో పర్యాయం పదవీకాలం ఈ ఏడాది అగస్టులో ముగియనుంది. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి నరసింహన్ పేరును తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. ఇందుకు కూడా అనేక కారణాలు వున్నాయిని సమాచారం. మరీ ముఖ్యంగా స్వతహాగా ఐపీఎస్ అయిన నరసింహన్.. దాయాధి పాకిస్థాన్ పై ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దాడుల నేపథ్యలో నరసింహన్ ఇచ్చిన పలు సూచనలతో ప్రధాని మన్ననలను కూడా అందుకున్నారని సమాచారం.
అంతేకాక ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కొరకరాని కోయ్యగా వున్న అనేక సమస్యలకు ఆయన తన అనుభవంతో సునాయాసంగా పరిష్కరించి.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పెద్దల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆయన సత్తా, చతురతను పరిగణలోకి తీసుకున్న ఎన్డీఏ ప్రభత్వం.. యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లలో దేశవ్యాప్తంగా ఎవరూ లేకపోయినా అయనను మాత్రం కొనసాగిస్తుంది. ఈ క్వాలిటీలే అర్హతగా ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి బీజేపి ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం.
రానున్న మే నెల 3న ఆయన పదవీకాలం ముగియనుండటంతో కేంద్రం ఆయన సేవలను వినియోగించుకునే క్రమంలో ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి పదోన్నతి కల్పించాలని భావిస్తుందని తెలుస్తుంది. ఇక ననసింహన్ సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా ఉపరాష్ట్రపతి పదవికి నరసింహన్ పేరును పరిశీలించే విధంగా దోహదపడ్డారని సమాచారం. ఇక ఈ విషయమై తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మంత్రివర్యులు కూడా ఈ విషయమై సంకేతాలను ఇచ్చారు. అన్ని అనుకూలిస్తే త్వరలోనే నరసింహన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు. మరెందుకు అలస్యం ముందుగానే మనం అల్ ది బెస్ట్ చెప్పేద్దాం.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more